కొంతమందికి నచ్చిన పనులు, మాటలు మాట్లాడితే ఒక్కసారిగా పైకి లేచి కొట్టినంత పనిచేస్తారు. పెద్ద పెద్దగా అరిచి గొడవ పెట్టుకుంటారు. తర్వాత శరీరమంతా చెమటలు పట్టి కళ్లు తిరిగి పడిపోతుంటారు కూడా. ఈ సమస్యనే అధిక రక్తపోటు గానీ బీపీ అని గాని అంటుంటారు. ఈ సమస్యని అధిగమించడానికి చిట్కాలు లేకపోలేదు. అవేంటో తెలుసుకొని బీపీని కంట్రోల్లో పెట్టుకుందాం. రాగిజావ. ఉదయాన్నే రాగిజావ చేసుకునే తాగితే కడుపు నిండడంతోపాటు శరీరం చల్లగా ఉంటుంది. అంతేకాదు ఎండలు కూడా వస్తున్నాయి. అలాగే గోధుమజావ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఈ జావ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది. నలుపు ద్రాక్ష గింజల రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ అనేవి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తనాళాల్లోని మలినాలను తొలిగించి వాపులను నియంత్రిస్తాయి.
నల్లద్రాక్ష పైల్స్ వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. షుగర్ వ్యాదిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తరిమికొడుతుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ రుగ్మతలకు చెక్ పెడుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్కు ఇది చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భరించలేనంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్లమిరియాలను నూరి అందులో టీస్పూన్ తేనె కలిపి రోజుకు మూడుసార్లు తినాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి రావాలన్నా భయపడుతుంది.
బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తం శుద్ధి అవడం వల్ల మనిషి చురుగ్గా ఉంటారు. ఫ్రెష్బ్లడ్ వచ్చినంత ఉత్సాహంగా ఉంటారు. బెల్లంలో మిరియాలపొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. దీన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది. ఇప్పటివరకు చలి ఎక్కువై జులుబు వస్తే ఇకపై ఎండలకు వేడి ఎక్కువై జలుబు, దగ్గులాంటి విమొదలవుతాయి. శరీరంలో వచ్చే మార్పులకు రోగాలు దగ్గరపడుతాయి. ఎలాంటి రోగానికైనా చిట్కాలుంటాయి. వాటిని నియంత్రణలో పెట్టుకొని ఫాలో అయితే సరిపోతుంది.