పూర్వ కాలంలో మన పెద్దలు, పూర్వీకులు నేలపై కూర్చుని భోజనం చేసేవారు. అందుకనే వారు అంత ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ తరువాతి కాలంలో డైనింగ్ టేబుల్స్ ఫ్యాషన్ అయిపోయాయి. ఇప్పుడు అది కూడా పోయి నిలబడి తింటున్నారు. కొందరైతే ఏకంగా మంచాలపైనే ఫుడ్ తింటున్నారు. అయితే పురాణాల ప్రకారం ఇలా ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే ఆహారాన్ని అవమానించినట్లే అవుతుందని వారు అంటున్నారు.
జ్యోతిష్యం మరియు శాస్త్రాల ప్రకారం, మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే, మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లే.అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవపరచడం లాంటిదని అంటారు.
తినడం అనేది బృహస్పతి మరియు రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు, కాబట్టి దానిని సంతోష పెట్టడానికి ఎల్లప్పుడూ మార్గాలు కనుగొనబడతాయి. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు. కనుక ఇకపై ఎట్టి పరిస్థితిలోనూ మంచం మీద కూర్చుని తినకండి. నేలపై కూర్చుని తినండి. లేదా డైనింగ్ టేబుల్ను ఉపయోగించండి.