Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Lord Ganesh And Lakshmi : వినాయ‌కుడు, ల‌క్ష్మీదేవి.. ఈ ఇద్ద‌రినీ క‌లిపే పూజించాలి.. ఎందుకంటే..?

Admin by Admin
October 27, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు.

డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకు కారణాలు ఏంటి..?, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడిని ఆది దేవుడిగా భావించి, మనం పూజలు చేస్తూ ఉంటాము. ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు.

you should do pooja to lakshmi and ganesh at once

మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు. అందుకే, క‌చ్చితంగా గణపతిని పూజించాలి. శుభకార్యాలు జరపాలన్నా, దేనినైనా మొదలు పెట్టాలన్నా, పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము. లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే, ఆమె సంపదకి అధిపతి. ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు. అయితే, జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది.

వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు. అందుకని, వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది. అడ్డంకులన్నీ తొలగిపోయి, సంపద కలగాలని గణపతిని, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు. పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు. ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని, ముందు వినాయకుడికి పూజ చేయాలని, లక్ష్మీదేవి చెప్తుంది. అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి, వినాయక పూజని మొదలుపెడతాడు. తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు. అలా వినాయ‌కుడిని, ల‌క్ష్మీదేవిని క‌లిపి పూజించ‌డం మొద‌లైంది.

Tags: lakshmi and ganesh
Previous Post

Lord Shiva : శివుడికి ఈ పువ్వుల‌తో పూజ చేస్తే.. ఏడు జ‌న్మ‌ల పాపం పోతుంది..!

Next Post

ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఏషియా క‌ప్ ఫైన‌ల్‌.. ఆఫ్గ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యం..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.