గృహిణిగా బాద్యతలు చేపట్టడం అంత చిన్న విషయం కాదు.కానీ చాలామంది అటు ఇంటి బాధ్యతలు,ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు..కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇంటి పనులు,పిల్లల బాద్యత అమ్మల కెరీర్ పై ప్రభావం చూపుతాయనేది వాస్తవం..దీన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే..ప్రతి ఫీల్డ్ లో కూడా ఇలాంటి వారుంటారు..పెళ్లై పిల్లలు పుట్టాక తమ ఉద్యోగ జీవితాన్ని విరమించేసి,కుటుంబ బాద్యతలు చూస్తున్నవారు..మన సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు..పెళ్లి తర్వాత సినిమా జీవితానికి చెక్ పెట్టేసిన భామలున్నారు. బాలివుడ్ నుండి టాలివుడ్ కి వచ్చిన వారు మనకు కూడా తెలుసు…
వీలైతే నాలుగు మాటలు ,కుదిరితే కప్పు కాఫీ అంటూ హాసిని చేసిన అల్లరి అంతా ఇంతా కాదు..సై,ఆరెంజ్,సత్యం,బొమ్మరిల్లు,శశిరేఖా పరిణయం ఇంకా అనేక సినిమాల ద్వారా జెనీలియా మనకు పరిచయమే..కానీ ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది బాలివుడ్ నుండి..తర్వాత దక్షిణాది అన్ని భాషల్లో కూడా నటించి నటిగా గుర్తింపు పొందింది.ఆ తర్వాత తొమ్మిదేళ్ల ప్రేమాయాణానికి చెక్ పెడుతూ రితేష్ ని పెళ్లి చేసుకుంది..వీరిద్దరూ తుజె మేరి కసమ్ ద్వారా బాలివుడ్ కి పరిచయమయ్యారు.ఈ సినిమా మన తెలుగు సినిమా నువ్వే కావాలి కి రీమేక్.ఇప్పుడు వీరికి ఇద్దరు అబ్బాయిలు..పెళ్లి తర్వాత జెనీలియా సినిమాల వైపు రాలేదు.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా ఆసిన్ ని టాలివుడ్ కి పరిచయం చేసారు పూరి జగన్నాద్..ఆ తర్వాత అందరి స్టార్ హీరోలతో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఆసిన్.గజిని సినిమాతో బాలివుడ్లో కూడా పాపులర్ అయ్యింది..ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది,ఇప్పుడు పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చూసుకుంటుంది.మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలవైపు చూడలేదు ఆసిన్.
వంశీ సినిమాతో టాలివుడ్ కి పరిచయమైన నమ్రత అప్పటికే హిందీలో సినిమాలు చేసింది.ఆ తర్వాత అంజి సినిమాలో మెగాస్టార్ తో కూడా నటించింది.వంశీ సినిమా అప్పుడు మహేశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ దంపతులయ్యారు.పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు నమ్రత.వీరికి కొడుకు గౌతమ్,కూతురు సితార ఉన్నారు. మందాకిని తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి నిర్మించి, దర్శకత్వం వహించిన సింహాసనం అనే సినిమాలో వాహ్వా నీ సాహసం..వాహ్వా నీ పౌరుషం అని కృష్ణతో స్టెప్పులేసింది మందాకిని. , నందమూరి బాలకృష్ణ నటించిన బార్గవరాముడు తదితర చిత్రాలలో నటించింది.రామ్ తేరి గంగా మైలి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ మందాకిని ఖాతాలో ఉన్నాయి. వివాహం తర్వాత తను సినిమాలకు చెక్ పెట్టింది.
చెప్పమ్మ చెప్పమ్మ చెప్మమ్మ చెప్పేసెయ్ అంటుంది…అంటూ మురారిలో సోనాలిని చూసిన ఎవ్వరూ ఇప్పటికీ తన రూపం మర్చిపోరు.పెళ్లి ,పిల్లల తర్వాత సోనాలి ముందులా లేదనేది స్పష్టమైన విషయం..మురారి,శంకర్ దాదా,మన్మదుడు..ఇలా తెలుగులో టాప్ హీరోలందరితోనూ జతకట్టింది సోనాలి బింద్రే…పెళ్లి తర్వాత ఈ సుందరి కూడా సినిమాలకు చెక్ పెట్టింది ఇప్పుడు కొన్ని బుల్లితెర షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఆపద్బాందవుడు సినిమాలో చిరంజీవి సరసన నటించింది మీనాక్షీ శేషాద్రి..ఎనభైలలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ ఏర్పరచుకుంది..తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హరీష్ మైసోర్ ని వివాహం చేసుకుని,భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయింది..ఇప్పుడు కుటుంబాన్ని చూసుకుంటూ అక్కడ పిల్లలకు డ్యాన్స్ క్లాసెస్ చెప్తుంది.
ప్రేమ పావురాలు సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన భాగ్యశ్రీ ,తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.అప్పట్లో భాగ్యశ్రీ ని ఇష్టపడని వాళ్లంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు.అంతలా ఆకట్టుకుంది తను…భాగ్యశ్రీ పెళ్లి నాటికి తన వయసు 19 సంవత్సరాలు..తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కోసం నా కెరీర్ ని త్యాగం చేసా అంటూ నవ్వుతూ చె్ప్తుంది భాగ్యశ్రీ.. రాజశేఖర్ ఓంకారం సినిమాలో,బాలక్రిష్ణ యువరత్న రాణా సినిమాలో కూడా భాగ్యశ్రీ ని చూడొచ్చు. శీనూ సినిమాలో వెంకటేశ్ సరసన జత కట్టిన ట్వింకిల్ ఖన్నా ..ఒకప్పుడు బాలివుడ్ లో స్టార్ హీరోయిన్..అక్షయ్ కుమార్ తో వివాహం తర్వాత సినిమాలకు చెక్ పెట్టి కుటుంబాన్ని చూసుకుంటూ ,ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తుంది.