ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వగా, మహేష్ బాబు కూడా పాన్ ఇండియా ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరి జీవితాలలోనూ నాలుగు విషయాలు ఒకే రకంగా జరిగాయి అంటూ సోషల్ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు సైతం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. కాగా ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణించిన రెండు నెలలకే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సైతం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ లోనూ ఇదే విధంగా జరిగింది.
రమేష్ బాబు మరణించిన కొద్ది కాలానికే మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. అంతేకాకుండా హరికృష్ణ చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేస్తున్నాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు.
ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేశారు. జక్కన్న దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి పరిస్థితి ఒకే విధంగా ఉంది. మహేష్ బాబు తండ్రిని కోల్పోయి బాధపడితే, జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న దూరం అవ్వడంతో బాధపడ్డాడు. ఇలా నాలుగు విషయాలు కూడా ఇద్దరి జీవితాలలో దాదాపు ఒకే విధంగా జరిగాయి.