రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు ఈ 5 పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కొంత బ‌ల‌హీనం అవ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంటుంది. దీంతో మ‌న శ‌రీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. అయితే శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అందుకు గాను కొన్ని ర‌కాల పండ్లు దోహ‌దం చేస్తాయి. అవేమిటంటే..

take these 5 fruits daily to increase immunity power

1. నారింజ పండ్ల‌ను నిజానికి అన్ని సీజ‌న్ల‌లోనూ తినాలి. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డమే కాదు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల‌ను అందిస్తాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక నారింజ పండ్ల‌ను త‌ర‌చూ తినాలి.

2. యాపిల్ పండ్ల‌ను సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, విట‌మిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం మెరుస్తుంది.

3. దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. దానిమ్మ పండ్ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగ‌వ‌చ్చు.

4. నారింజ పండ్ల‌లాగే బ‌త్తాయి పండ్ల‌లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని కూడా త‌ర‌చూ తీసుకోవాలి. ఇవి సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది.

5. కివీ పండ్లు పుల్ల‌గా, తియ్య‌గా ఉంటాయి. వీటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్ సి, పొటాషియం, విట‌మిన్ ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

ఇక రోగ నిరోధక శ‌క్తి పెరిగేందుకు పైన తెలిపిన పండ్లు తిన‌డం మాత్ర‌మే కాకుండా ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..

* రోజూ శ‌రీరానికి ఎండ త‌గిలేలా చూసుకోవాలి. దీంతో విట‌మిన్ డి అందుతుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

* చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువ‌గా తాగితే శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూక‌స్ త‌గ్గుతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రావు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* శ‌రీర ఉష్ణోగ్ర‌త కొంచెం పెరిగితే దాన్ని జ్వ‌రం అంటారు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందంటే రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని అర్థం చేసుకోవాలి. అందుక‌ని రోగ నిరోధక శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts