టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు. ఇవే కాదు, పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

టీ, కాఫీలను పరగడుపున తాగరాదు. కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత తాగవచ్చు. దీని వల్ల మూడ్‌ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చురుగ్గా పనిచేస్తారు.

చెర్రీ పండ్లను రాత్రి పూట తినాలి. వీటిలో మెలటోనిన్‌ మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. కనుక చెర్రీ పండ్లను తింటే చక్కగా నిద్ర పడుతుంది. అందువల్ల వాటిని రాత్రి పూట తినాల్సి ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్నం తింటే నిద్ర వస్తుంది కనుక వాటిని ఆ సమయంలో తినరాదు. రాత్రి పూట తినాలి.

యాపిల్‌ పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ సమస్యలు ఏర్పడవు.

పాలను రాత్రి పూట తాగితే మంచిది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే సమ్మేళనం నిద్ర పట్టేలా చేస్తుంది. అందువల్ల పాలను రాత్రి పూట తాగాలి.

Share
Admin

Recent Posts