ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడితోపాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు వస్తున్నందున ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వాటిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడతుంది. కింద తెలిపిన 5 మూలికలను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే..
1. అశ్వగంధ. దీన్నే ఇండియన్ జిన్సెంట్ అని పిలుస్తారు. దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. కార్టిసోల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. దీంతోపాటు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. మూడ్ మారుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అశ్వగంధ చూర్ణం, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. చూర్ణాన్ని పాలతో తీసుకోవచ్చు. ట్యాబ్లెట్లు అయితే ఉదయం, సాయంత్రం 250 ఎంజీ మోతాదులో వాడాలి. డాక్టర్ సూచన మేరకు వాడుకుంటే మంచిది.
2. బ్రహ్మి.. దీన్నే సరస్వతి మొక్క అంటారు. ఇది మానసిక సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. బ్రహ్మిలో బయో కెమికల్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను పునర్నిర్మిస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివితేటలు పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ను బ్రహ్మి టార్గెట్ చేస్తుంది.దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. బ్రహ్మి కూడా చూర్ణం, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది.
3. తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. తిప్పతీగ చూర్ణం లేదా జ్యూస్ను రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.
4. పసుపును అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. ఇందులో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
5. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు మండూకపర్ణి లేదా ఖులకుడి అనే మూలిక కూడా బాగానే పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడున యాక్టివ్ గా ఉంచుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365