Acidity : కడుపులో మంటగా ఉందా ? ఈ చిట్కాలను పాటించి చూడండి.. చల్లబడుతుంది..!

Acidity : కడుపులో మంట.. దీన్నే అసిడిటీ అంటారు. ఎలా పిలిచినా సరే ఇది వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కడుపులో మంట ఉంటే ఏ పని చేయబుద్దికాదు. ఏమీ తినలేం. తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే అసిడిటీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.

follow these amazing remedies for Acidity
Acidity

వేళకు భోజనం చేయకపోవడం.. రాత్రి పూట బాగా ఆలస్యంగా తినడం.. మద్యం ఎక్కువగా సేవించడం.. పొగ తాగడం.. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం.. టీ, కాఫీలను అధికంగా తాగడం.. వంటి పలు కారణాల వల్ల అసిడిటీ వస్తుంటుంది. దీన్ని కింద తెలిపిన చిట్కాలను పాటించి సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కడుపులో మంట మరీ ఎక్కువగా ఉన్నవారికి పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకులను నాలుగైదు తీసుకుని వాటిని ఉదయాన్నే పరగడుపునే అలాగే బాగా నమిలి మింగాలి. పుదీనాలో సహజసిద్ధమైన అంటాసిడ్‌ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజూ ఇలా తింటుంటే దెబ్బకు అసిడిటీ తగ్గుతుంది.

2. భోజనం చేసే ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో అసిడిటీ తగ్గుతుంది. నిమ్మరసం అంటే యాసిడ్‌ స్వభావం ఉన్నది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది మన జీర్ణాశయంలోకి వెళ్లినప్పుడు వేరే రూపంలోకి మారుతుంది. కనుక దాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు.

3. అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. భోజనం అనంతరం రెండు గంటల తరువాత ఒక అరటి పండును తినాలి. దీంతో కడుపులో మంట తగ్గిపోతుంది.

4. చల్లని పాలలో ఒక టీస్పూన్‌ తేనె కలిపి తాగాలి. దీని వల్ల కూడా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

5. భోజనం అనంతరం రెండు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. అనంతరం నీళ్లు తాగాలి. ఇలా చేస్తుంటే కడుపులో మంట తగ్గిపోతుంది.

Share
Admin

Recent Posts