చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

అందంగా కనిపించాలి. అందరూ మనల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి. అని చాలా మంది కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. దీనిని మెయింటెయిన్ చేయడం కోసం నెలకు ఒకసారో, రెండు సార్లో బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. లేని పక్షంలో కాస్తంత ఖర్చు పెట్టుకుని బ్యూటీ నిపుణుల దగ్గర కొన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ముఖంపై ముడతలు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ ముడతలను కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోనే తగ్గించేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాస్తంత కొబ్బరినూనెను గోరు వెచ్చగా చేసుకోవాలి. ఆ నూనెను రాత్రి పడుకునే ముందు ముఖానికి బాగా పట్టించాలి. ముఖానికి నూనె పెట్టే సమయంలో ఒక దిశలో మర్దనా చేయాలి. రాత్రంతా నూనె ముఖానికే ఉంచుకుని ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు.

ముఖం జిడ్డు, ముడతల సమస్యలతో బాధపడే వారికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును ముఖానికి బాగా పట్టించాలి. ఒక అరగంట సమయం కలబందను ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా చర్మంలో తేమ స్థాయిలు పెరిగి చర్మం సాగే గుణం పునరుద్దరించబడుతుంది. కలబంద గుజ్జులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది ముఖంపై ముడతలు, జిడ్డుతో పాటు డీహైడ్రేషన్, చలి వల్ల ముఖంపై ఏర్పడే గీతలను కూడా తగ్గిస్తుంది. చర్మానికి కావాల్సిన పోషణ అందించడంలో, చర్మ కణాలను ఆరోగ్యవంతంగా మార్చడంతో పాటు వాటిని రక్షించడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మంపై తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. స్వచ్చమైన తేనెను ముఖమంతా రాసి బాగా ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మంలో గ్లో కూడా పెరుగుతుంది.

follow these tips if you have facial lines

ఆలివ్ ఆయిల్‌తో ముఖం మీద మర్దన చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ చర్మానికి బాగా పట్టిన తర్వాత ఒక గంట సేపు ఆరనివ్వాలి. కావాలనుకుంటే రాత్రి సమయంలో ముఖానికి ఆలివ్ ఆయిల్ రాసి ఉదయాన్నే కూడా కడిగేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్‌తో ముఖం మీద మసాజ్ చేసినపుడు చర్మకణాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్, ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. దీనివల్ల నుదుటి మీద గీతలు, కంటి చుట్టూ ఉండే ముడతలు పోతాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల రోజ్ వాటర్, రెండు చెంచాల గ్లిజరిన్, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేయాలి. 15-30 నిమిషాల తరవాత నీళ్లతో కడిగేస్తే ముఖం మీద పేరుకున్న మడ్డి, జిడ్డు తొలగిపోవడంతో పాటు చర్మం స్టిఫ్‌గా మారుతుంది.

Admin

Recent Posts