ప్రధాన భూ రష్యా (mainland Russia) నీ క్రైమియానీ కలిపే 19 కిలోమీటర్ల పెనువంతెన పునాదుల్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బలగాలు 1100 కిలోల శక్తిమంతమైన బాంబులతో పేల్చివేసాయి. ఫలితంగా ఇప్పుడా వంతెన మీద వాహన సమ్మర్దాన్ని ఆపివేశారు.
ఆ వంతెన 2014 తరువాత రష్యా నిర్మించినది. అంతకు ముందు లేదు. దాని మీద ఉక్రెయిన్ దాడిచేయడం ఇది మూడో సారి. తొలిదాడి 2022 అక్టోబర్ లో జరగ్గా, 2023 లో రెండో దాడి జరిగింది. లోగడ దాడులతో పోలిస్తే తాజాగా చేసినది మిక్కిలి శక్తిమంతమైన దాడి. దీన్ని 18 నెలల పాటు మునిగీటి (ప్లాన్ చేసి) అమలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన విధ్వంసం మూలాన వంతెన ఏ క్షణాన్నయినా పూర్తిగా కూలిపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్రైమియా 2014 వరకు ఉక్రెయిన్ లో అంతర్భాగంగా ఉన్న రాష్ట్రం. ఒక సముద్ర ద్వీపం. ఆ సంవత్సరమే రష్యా దాన్ని విలీనం చేసుకుంది. అందుకు ఉక్రెయిన్ ఆమోదించలేదు.
క్రైమియా వైశాల్యం రమారమి 28,000 చ.కి.మీ.లు. అంటే దాదాఁపు మన దక్షిణ కోస్తా జిల్లాలంత ఉంటుంది. జనాభా 25 లక్షలు. వారిలో 77% మంది రష్యన్ భాష మాట్లాడతారు. రాజధాని సెవాస్తోపోల్.