ప్రస్తుత తరుణంలో చాలా కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ఇది అన్నింటిపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది అనేక ఇతర సమస్యలను కలగజేస్తుంది. కనుక కుటుంబ సభ్యులు లేదా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా సరే హ్యాపీగా ఉంటుంది. ఇక ఆ నియమాలు ఏమిటంటే..
భార్య, భర్త ఇద్దరూ ఒకేసారి కోప్పడకూడదు. ఇంట్లో భార్య, భర్త అరుపులు కేకలు వినపడకూడదు. పిల్లల ముందు భార్య, భర్తలు గొడవ పడకూడదు. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ప్రేమతో సరిచేయాలి. అవతలివారి చేదు గతాన్ని త్రవ్వకూడదు. క్షమించాలి, అవసరమైతే క్షమాపణ కోరాలి. మనస్పర్థలతో పడుకోకూడదు. నిద్రకు ఉపక్రమించే ముందే వాటిని క్లియర్ చేసుకోవాలి.
ఒకరిపై ఒకరికి అనుమానము ఉండకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. కుటుంబముగా కలిసి ప్రార్థించాలి. భోజనము చేయాలి. ఒకరినొకరు మెచ్చుకోవాలి. తృప్తి కలిగి జీవించాలి.