lifestyle

బ్రిటీష్ వారు లేకుంటే మరే ఇతర ఐరోపా శక్తులు భారతదేశాన్ని దోచుకునేవా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఖచ్చితంగా దోచుకునేవి&period; బ్రిటీషు వారితో పాటు&comma; బుడతకీచులు&lpar;portuguese&rpar;&comma; ఫ్రెంచి వారు&comma; డచ్చి వారు మన దేశంలో స్థావరాలు ఏర్పరుచుకుని రాజ్య విస్తరణ చేసే దిశగా ప్రయత్నించారు&period; బ్రిటీషు వారికి అధిక వనరులు ఉండటం&comma; వారి అంతర్గత పరిస్థితులు నిలకడగా ఉండటం&comma; అదే సమయంలో ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం మొదలయ్యి వారు ఇతర దేశాల కన్నా సాంకేతికంగా&comma; ఆర్థికంగా బలోపేతం అవటం వల్ల వీరు ఇతర ఐరోపా శక్తుల మీద పై చేయి సాధించగలిగారు&period; బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ఎన్నో రెట్లు పెద్దది&comma; శక్తిమంతమైనది&comma; VOC&lpar;డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ&rpar; ప్రస్తుత ఇండోనేసియా&comma; మలేసియా&comma; ఇతర తూర్పు ఆసియా దేశాల సుగంధ ద్రవ్యాల వాణిజ్యం మొత్తం వీరి చేతిలోనే ఉండేది&period; వీరు పులికాట్ సరస్సు ప్రధాన కేంద్రంగా మచిలీపట్నం&comma; నాగపట్నం&comma; రాజమండ్రి&comma; భీమునిపట్నం&comma; నాగులవంచలో&lpar;ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది&rpar; స్థావరాలు&comma; కోటలు ఏర్పాటు చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి రాజమండ్రి జైలు ఉన్న చోట వారి కోట ఉండేది&period; భీమునిపట్నంలో వారి భవనాలు&comma; సమాధులు ఇప్పటికీ మనం చూడవచ్చు&period; నాగులవంచలో వారి ఆగడాలను సహించలేని స్థానికులు 1687లో వారి స్థావరంపై దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేశారు&period; బహుశా భారత దేశంలో సామాన్య ప్రజలు&lpar;రాజులు కాకుండా&rpar; యూరోపియన్ శక్తులపై తిరగబడడం ఇదే మొదటి సారి కావచ్చు&period; ఉత్తర భారత దేశం&comma; బెంగాలు&comma; పంజాబు రాష్ట్రాలపై మక్కువ ఉన్న చరిత్రకారులు దీనికి ప్రచారం కల్పించలేదు&period; మన చరిత్ర గురించి ఆసక్తి లేని మన తెలుగు వారు దీని గురించి విని కూడా ఉండరు&period; VOC వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ కోల్పోయి బలహీనపడింది&period; పోర్చుగీసు వారితో యుద్ధాల వల్ల ఇరువురు బాగా నష్ట పోయారు&period; అయితే డచ్చి వాడి సామ్రాజ్య స్థాపన కాంక్షను సమూలంగా నాశనం చేసింది తిరువాన్కూరు మహారాజు మార్తాండ వర్మ&period; ఈయన కులాచల యుద్ధంలో డచ్చి వాడిని చిత్తు చిత్తుగా ఓడించాడు&period; వారి నాయకుడు డి లనాయ్ మోకాళ్ళ మీద కూర్చుని క్షమించమని అడిగితే వాడికి&comma; వాడి సైన్యానికి ప్రాణ భిక్ష పెట్టి వదిలేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81694 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;indian-people&period;jpg" alt&equals;"what would have happened if british not came to india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డచ్చి వారి రాజ్య విస్తరణ కాంక్షలకు చరమ గీతం పాడిన ఈ యుద్ధానికి దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నపటికీ మన ప్రసిద్ధ చరిత్రకారులు&comma; పెద్దలు ఎందుకో దీన్ని విస్మరిస్తారు&period; ఒక భారత రాజు&comma; యూరోపియన్ సైన్యంపై గెలిచాడనే అక్కసు కావచ్చు&period; ఈ యుద్ధంతో డచ్చి వారి సామ్రాజ్య కాంక్షలు ఆవిరయ్యాయి&period; బ్రిటీషు వారితో సంధి చేసుకుని మిగిలిన స్థావరాలను 1825లో వారికి అప్పగించి నిష్క్రమించారు&period; మన దేశానికి మొదట వచ్చింది పోర్చుగీసు వారే&period; చివరన పోయిందీ &lpar;తరిమి కొట్టబడిందీ&rpar; వీరే&period; సామ్రాజ్యం స్థాపించడానికి అన్ని అవకాశాలు ఉన్నపటికీ వారే చేజేతులా నాశనం చేసుకున్నారు&period; బొంబాయి వీరిదే&period; వారి రాకుమార్తె అయిన కేథరిన్ ఇంగ్లాండు రాజైన రెండవ చార్ల్స్ను పెళ్ళాడినప్పుడు కట్నం కింద బొంబాయిని బ్రిటీషు వారి పరం చేశారు&period; మత మౌఢ్యం&comma; ఇతర యూరోపియన్ దేశాలతో&comma; విజయనగర&comma; బీజాపూర్&comma; మొఘల్ రాజ్యాలతో యుద్ధాలు వీరిని గోవాకు&comma; గుజరాత్లో రెండు చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి సైనిక చర్యతో దిగి వచ్చి 1961లో ఖాళీ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోవాలోని హస్త ఖండనా స్తంభం&period; మతం మారని హిందువుల చేతులను ఇక్కడ నరికేసే వారు&period; ఫ్రెంచి వారు చివరిగా వచ్చిన వారు&period; వీరికీ బ్రిటీషు వారికి అంతకు పూర్వమే ఉన్న శతృత్వం వల్ల వీరు మన దేశంలో బ్రిటీషు వారి శతృ పక్షం వహించే వారు&period; హైదరాబాదు&comma; ఆర్కాటు వారసత్వ యుద్ధాలలో చెరొకరి పక్షం వహించే వారు&period; వారి గవర్నరుగా డుప్లేయి ఉన్నప్పుడు ఫ్రెంచి&comma; బ్రిటీషు వారి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండి ఫ్రెంచి వారికి కొంత మొగ్గు కనపడింది&period; మద్రాసు నగరాన్ని కొంత కాలం బ్రిటీషు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు&period; అయితే ఐరోపాలో రెండు దేశాల మధ్య సంధి కుదరటం&comma; ఫ్రాన్స్ దేశంలో తరచుగా అరాచక పరిస్థితులు ఏర్పడటం వల్ల వీరు పుదుచ్చేరి&comma; యానాం&comma; రెండు ఇతర చిన్న ప్రాంతాలు తప్ప మొత్తం బ్రిటీషు వారి పరం చేయ వలసి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-81693" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;indian-people-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూరు యుద్ధ కాలంలో హైదర్ అలీ&comma; అతడి కుమారుడు టిపు సుల్తానులు ఇరువురు ఫ్రెంచి వారు వారికి ఆంగ్లేయులపై యుద్ధంలో సాయ పడతారని ఆశ పడ్డారు&period; కానీ అదే సమయంలో ఫ్రెంచి విప్లవం జరగటం&comma; వారి స్వదేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఇది జరగలేదు&period; చివరికి 1954లో దడాల రాఫెల్ రమణయ్య అనే తెలుగు స్వతంత్ర వీరుడు ఎంతో సాహసోపేతంగా యానాంపై దాడి చేసి ఫ్రెంచి తూటాలకు ఎదురు వెళ్లి యానాం పట్టణాన్ని విముక్తి చేశాడు&period; బహుశా ఈయన తెలుగు వాడిగా పుట్టినందువల్ల రావలసిన పేరు రాలేదు&period; యానాం విముక్తి తర్వాత పుదుచ్చేరి&comma; ఇతర ఫ్రెంచి ఆక్రమిత ప్రాంతాలు అదే సంవత్సరంలో స్వతంత్ర భారత దేశంలో విలీనమైనాయి&period; వీరే కాకుండా డెన్మార్క్ వారికి కూడా బెంగాలులో&comma; నికోబార్ ద్వీపాలలో చిన్న వలసలు ఉండేవి&period; వాటిని పంతొమ్మిదవ శతాబ్ది లోనే డెన్మార్క్ బ్రిటిష్ వారికి అప్పగించేసింది&period; ఇలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత మన దేశంలో యూరోపియన్ శక్తుల శకం ముగిసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts