మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయాయని అర్థం..

మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంటాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి శరీరం విష తుల్యం కాకుండా ఉంటుంది. అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. దీంతో కిడ్నీ సంబంధ సమస్యలు వస్తాయి. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అయితే కిడ్నీల పనితీరు మందగించినప్పుడే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు. ఇక కిడ్నీల ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని నీళ్లను తాగినా మూత్రం సరిగ్గా రావడం లేదంటే.. కిడ్నీల్లో సమస్య ఉన్నట్లు గుర్తించాలి. అలాగే మూత్రం ఎరుపు లేదా గోధుమ రంగులో వస్తున్నా అనుమానించాలి. ఇక కిడ్నీల సమస్య ఉంటే శరీరం వాపులకు గురవుతుంది. ముఖం, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి. అలాగే బీపీ కూడా పెరుగుతుంది.

if you have these symptoms then your kidneys might be in danger

ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు తదితర సమస్యలు ఉన్నా కిడ్నీల పనితీరు మందగించిందని అర్థం. అలాగే అలసట, నీరసం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించాలి. అలాగే రోజూ రాత్రి పూట మెళకువ వస్తుండడం, మూత్రం బాగా వస్తుండడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు అనారోగ్యం బారిన పడ్డాయని అర్థం చేసుకోవాలి.

అలాగే మూత్రంలో నురుగు ఎక్కువగా కనిపిస్తున్నా కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయేమోనని అనుమానించాలి. అలాగే పాదాల వద్ద వాపులు వచ్చి వేలితో నొక్కగానే చర్మం లోపలికి పోయినట్లు ఉంటే కిడ్నీల సమస్యలు ఉన్నట్లు అనుమానించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ముందే తెలుస్తుంది. దీంతో కిడ్నీలు పూర్తిగా చెడిపోకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. తగిన చికిత్స తీసుకుని కిడ్నీలను రక్షించుకోవచ్చు.

ఇక కిడ్నీల సమస్యలు ఉన్నవారు మాంసాహారం తినడం తగ్గించాలి. అలాగే ఫాస్ట్‌ ఫుడ్స్‌, కూల్‌ డ్రింక్స్, మద్యం తాగరాదు. చికెన్‌, చేపలు, కోడిగుడ్లలో పచ్చ సొన, బీన్స్‌, పప్పులు, వెన్న, చీజ్‌, పెరుగు, చక్కెర, ఉప్పు వంటి వాడకం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. అలాగే అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లను తాగడం, వ్యాయామం చేయడం, ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Share
Editor

Recent Posts