పుట్టగొడుగులు మంచి పోషకాహారం అని మనందరికీ తెలుసు. రెస్టారెంట్స్ లో చాలా వెరైటీస్ లో మష్రూమ్ డిషెస్ కూడా సర్వ్ చేస్తున్నారు. తరచూ వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పుట్ట గొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పుట్ట గొడుగులను తింటే క్యాల్షియం లభించి ఎముకలు బలంగా మారుతాయి. విటమిన్ డి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వీటిని తినడం వల్ల లభించే విటమిన్ బి12 నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెడ, భుజాల నొప్పి తగ్గుతుంది. రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడతారు. అయితే పుట్ట గొడుగులను కొందర మాత్రం తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
వీటిని అందరూ తినకూడదని, తింటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎవరెవరు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు తల్లి పాలు ఎండిపోయేట్లు చేస్తాయంటారు కాబట్టి పాలిచ్చే తల్లులు వాటిని తినరాదు. పుట్టగొడుగులలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు వాటిని ఎక్కువగా తినకూడదు. చర్మ అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పుట్టగొడుగులను తినకూడదు.