Paneer Curry : ధాబాల‌లో ల‌భించే విధంగా ప‌నీర్ క‌ర్రీని ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Paneer Curry : పాల‌తో త‌యారు చేసే ప‌న్నీర్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ ను తిన‌డం వ‌ల్ల పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ప‌న్నీర్ తో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌న్నీర్ తో రుచిగా, సుల‌భంగా ధాబా స్టైల్ లో క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ ప‌న్నీర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌న్నీర్ – 200 గ్రా., కారం – రెండున్న‌ర‌ టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర‌ టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ముప్పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, ట‌మాట ముక్క‌లు – ఒక క‌ప్పు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాల‌కులు – 2, ల‌వంగాలు – 2, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, చిలికిన తియ్య‌టి పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Paneer Curry recipe in telugu make in this way
Paneer Curry

ధాబా స్టైల్ ప‌న్నీర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ప‌న్నీర్ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధ‌నియాల పొడి, పావు టీ స్పూన్ గ‌రం మ‌సాలా వేసి కల‌పాలి. మ‌సాలాల‌న్నీ ప‌న్నీర్ ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకున్న త‌రువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న ప‌న్నీర్ ముక్క‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటికి ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం పేస్ట్, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత వేయించిన ప‌న్నీర్ ముక్క‌లు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌న్నీర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా, పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ప‌న్నీర్ క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts