ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట. కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరానికి తగిన కాల్షియం అందితేనే శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి. అదే కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అంతేకాదు దీర్ఘకాలం కాల్షియం లోపిస్తే.. ఎముకలు పెళుసు బారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాలు, పాల ఆధారిత పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట. ఇంతకీ అవేంటో.. వాటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
చియా విత్తనాలలో ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. రాజ్ గిరా విత్తనాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. ఇందులో కాల్షియంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. గుమ్మడి గింజలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి విత్తనాలలో గ్లాసుడు పాలలో ఉన్న కాల్షియంకు సమాన కాల్షియం ఉంటుంది. వీటిని రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మునగ ఆకులలో ఐరన్ అధికంగా ఉంటుందని చెబుతారు. అయితే ఐరన్ మాత్రమే కాదు.. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. మునగ ఆకులలో పాల కంటే 10 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా మెరుగ్గా ఉంటుంది. పాలు తాగే అలవాటు లేనివారికి కాల్షియం సమృద్దిగా అందాలంటే ప్రతి రోజూ ఒక స్పూన్ తెల్ల నువ్వులు తినడం చాలా హెల్ప్ చెస్తుంది. స్పూన్ నువ్వులలో గ్లాసుడు పాలకంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది.