డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి సహజంగానే రోజూ ప్లేట్లెట్లు పడిపోతుంటాయి. అందువల్ల రోజుల తరబడి తగ్గని జ్వరం ఉంటే వెంటనే ప్లేట్లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మరీ తక్కువైతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే డెంగ్యూ మాత్రమే కాదు, ఇతర ఏ జ్వరం వచ్చినా సహజంగానే ప్లేట్లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మరీ ఎక్కువగా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే ప్లేట్లెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు. వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. బొప్పాయి పండ్లను తివడం వల్ల డెంగ్యూ వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. బొప్పాయి చెట్టు ఆకుల రసాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగుతుండాలి. దీని వల్ల కూడా ప్లేట్లెట్లు పెరుగుతాయి.
2. దానిమ్మ పండ్లను తింటున్నా ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
3. ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తింటుండాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్ కె ప్లేట్లెట్లను పెంచుతుంది.
4. వెల్లుల్లి రెబ్బల్ని రోజూ ఉదయాన్నే పరగడుపున 2 అలాగే నమిలి తినాలి. ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.
5. రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక కప్పు బీట్ రూట్ జ్యూస్ను తాగాలి. దీంతో రక్తం పెరగడమే కాక ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.
6. క్యారెట్లను పూటకు ఒకటి చొప్పున తింటుండాలి. లేదా ఒక కప్పు క్యారెట్ జ్యూస్ను ఉదయం బ్రేక్ఫాస్ట్తో తీసుకోవాలి.
7. కిస్మిస్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.
8. ఆప్రికాట్ పండ్లను నిత్యం రెండు సార్లు తీసుకోవాలి. రెండు సార్లు కలిపి ఒక 30 గ్రాముల యాప్రికాట్ పండ్లను తినేలా చూసుకోవాలి. దీని వల్ల ప్లేట్లెట్లు పెరుగుతాయి.
9. ఖర్జూరాలను రోజుకు 3 తినాలి. పూటకు ఒక కివీ పండును తినాలి.
10. నారింజ పండ్లను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినాలి. లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్లో నారింజ పండ్ల రసం తాగాలి.
ఇలా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డెంగ్యూ మాత్రమే కాకుండా ఇతర విష జ్వరాల నుంచి కూడా త్వరగా కోలుకుంటారు.