ఏమీ అయిపోలేదండీ.. మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట.. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ, గుంటూరు, నెల్లూరు జిల్లాల(నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది) నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం (కంచి) లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు.. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని తాము ఆంధ్ర రాజుల గానే అభివర్ణించుకున్నట్లు చెప్తారు.. పల్లవ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ రాజుల పేర్లు ఒకసారి చుడండి.. అధిక శాతం రాజుల పేర్ల చివర్లలో వర్మ అని గమనించవచ్చు..
ఆంధ్ర ప్రాంతంలో క్షత్రియులు (రాజులు), అగ్నికుల క్షత్రియులు తమ పేర్ల చివర ఈ వర్మ అని పెట్టుకుంటారు.. కాబట్టి ఒక రకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న క్షత్రియ కులస్థులు కూడా పల్లవుల వారసులు ఉన్నారు.. సరే మన క్షత్రియులే కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కథలో తొండమాన్ చక్రవర్తి గుర్తున్నారా? ఆ తొండమాన్ (తొండైమాన్) రాజులు కూడా పల్లవుల వారసులే.. ప్రస్తుతం ఆ తొండమాన్ రాజవంశీకుల వారసుడు ఉన్నారు రాజగోపాల్ తొండైమాన్ గారని, వారి వృత్తి ప్రొఫెషనల్ షూటింగ్, వారి భార్య రాజకీయాల్లో ఉన్నారు.. ఇక చోళుల సంగతి దగ్గరకి వస్తే, చోళుల సామ్రాజ్యం కేవలం తమిళనాడు తో ఆగిపోలేదు,దక్షిణాసియా వరకు విస్తరించింది.. శ్రీలంక, వియత్నాం, ఫిలిపైన్స్ , మలేషియా ఇలా చాలా చోట్ల తమ జెండా పాతేసారు , కాబట్టి వారి సంతతి ఆసియా లో అనేక ప్రాంతాల్లో విస్తరించింది అని చెప్పొచ్చు..
ఇక తమిళనాడులో పిచ్చవరం పాలైకార్లు చోళుల వారసులు గా చెప్తున్నారు, ప్రస్తుతం ఆ వంశంలో ఉన్న మహారాజ మన్నార్ సూరప్ప చోళ గారిని చోళ వంశ వారసుడిగా చెప్తున్నారు… అయితే రాజులు, రాజ్యాలు పోయాయి , కేవలం వారసత్వం మాత్రమే మిగిలాయి, దుర్భర దారిద్య్రం లో జీవిస్తున్నారు అంట! ఏది ఏమైనా, కోటలు , ఆస్తులు లేకపోయినా వారి పూర్వికులు చరిత్ర లో సాధించిన ఘనత , చేసిన సత్కార్యాలు మాత్రం అజరామరమే ..