భూమిపై జన్మించిన ప్రతి జీవికి పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ప్రతి క్షణానికి ఎంతో మంది చనిపోతుంటారు, ఎంతో మంది జన్మిస్తుంటారు. అయితే కొందరు దీర్ఘాయువుతో బతికితే కొందరు త్వరగా చనిపోతారు. ఇక కొందరు పిల్లలను కూడా దేవుడు త్వరగా తీసుకెళ్తుంటాడు. ఇందుకు కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే..
పిల్లలు ఏం పాపం చేయకున్నా వారిని దేవుడు త్వరగా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం కాదు, వారి తల్లిదండ్రులు చేసిన పాపాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా మనకు ఈ జన్మలో అనుభవాలు కలుగుతాయి.
జ్యోతిష్యం ప్రకారం పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకు బాలారిష్టాలు ఉంటాయి.అప్పటి దాకా ఆయుర్దాయం లెక్క కట్టకూడదు అని అంటారు. ఏమైనా సమస్యలు వస్తే జప,హోమ, వైద్య చికిత్సల ద్వారా తగ్గించుకోవాలి.
ఇక పిల్లలు 4 సంవత్సరాల లోపల చనిపోతే అది మాతృదోషం. అంటే తల్లి చేసిన పాపాల వల్ల బిడ్డ చనిపోయినట్లు అర్థం చేసుకోవాలి. అదే 4 నుంచి 8 ఏళ్ల మధ్య పిల్లలు చనిపోతే అది పిత్రుదోషం. అంటే తండ్రి చేసిన పాపాల వలన బిడ్డ చనిపోయినట్లు లెక్క. ఇక 8 నుంచి 12 సంవత్సరాల లోపల చనిపోతే అది బాలుర దోషం. అంటే ఆ పిల్లలు పోయిన జన్మలో చేసిన పాపాల ఫలితంగా మరణిస్తున్నారని అర్థం.
అంతే కాకుండా కొన్ని కుటుంబాలకు/వ్యక్తులకు ప్రబలమైన నాగదోషాలు ఉంటాయి. వారిలో ఎవరి వలన ఎవరు చనిపోతారు అనేది కూడా చెప్పలేము. కారణం ఏదైనా తల్లితండ్రుల కంటే ముందే పిల్లలు చనిపోవడం, అందులోనూ పసిపిల్లలు చనిపోవడం అనేది చెప్పలేని, తీర్చలేని బాధ. పగవారికి కూడా అలాంటి కష్టాలు రాకూడదు.