Mushroom Masala Curry : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Mushroom Masala Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప్ర‌స్తుత త‌రుణంలో ఇవి అన్నీ కాలాల్లోనూ మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. పుట్ట గొడుగ్గుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పుట్టగొడుగుల‌తో మ‌నం అనేక‌ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా ప‌ట్టుగొడుగుల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ మ‌సాలా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పుట్ట గొడుగులు – 250 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 2, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, గ‌రం మ‌సాలా పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్,ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mushroom Masala Curry recipe in telugu make in this method
Mushroom Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పుట్ట‌గొడుగుల ముక్క‌ల‌ను వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ ను వేయాలి.

త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించి పెట్టుకున్న పుట్ట గొడుగు ముక్క‌ల‌ను వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఒక గ్లాస్ నీటిని పోసి క‌ల‌పాలి. దీనిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వల్ల మ‌నం రుచితో పాటు పుట్ట‌గొడుగ్గుల్లో ఉండే పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts