వినోదం

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలామంది దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం పెరగడంతో సినిమాలలో ఉన్న చిన్న చిన్న లాజిక్ పాయింట్లను గమనించి నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా వైరల్ అవుతున్న వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురం సినిమా ఒకటి.

2020 జనవరి 12న సంక్రాంతి సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. జులాయి, అల వైకుంఠ‌పురం ఈ రెండు సినిమాలలోని ఓ కామన్ పాయింట్ ని రైజ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 2012 ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకి వచ్చిన జులాయి చిత్రంలో అల్లు అర్జున్, ఇలియానా, సోను సూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీ ని నడిపే మూర్తిగా నటించిన విషయం తెలిసిందే.

have you observed this common point in trivikram and allu arjun movies

ఆ ఆఫీసులో పని చేసే మధుగా ( ఇలియానా) నటించింది. ఈ సినిమాలో విలన్ తన గ్యాంగ్ తో కలిసి విదేశాలకు పారిపోయేందుకు పిజ్జా డెలివరీ బాయ్ వేషంలో వచ్చి మధుని స్పృహ తప్పిపోయేలా చేసి ఆమెని తీసుకుని ఎయిర్పోర్టుకి బయలుదేరుతాడు. ఆ సమయంలో ట్రావెల్ ఏజెన్సీ పేరు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని కంపెనీ పేరు కనిపిస్తుంది. అచ్చం ఇలాగే అలవైకుంఠపురం సినిమాలో కూడా ఈ కంపెనీ పేరు కనిపించడంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో ఈ కామన్ పాయింట్ ని పట్టుకొని తెగ రచ్చ చేసేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు గురూజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Admin

Recent Posts