Dum Aloo Curry : ధాబాల‌లో ల‌భించే ద‌మ్ ఆలు క‌ర్రీ.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది..

Dum Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌లతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ధ‌మ్ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ దేనితోనైనా తిన‌డానికి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ధ‌మ్ ఆలూ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధ‌మ్ ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బేబి పొటాటోస్ – పావు కిలో, తరిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్.

Dum Aloo Curry recipe in telugu tastes better with roti
Dum Aloo Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయలు – 2, జీడిప‌ప్పు – రెండు టేబుల్ స్పూన్స్, సార ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4.

ధ‌మ్ ఆలూ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి ఫోర్క్ తో రంధ్రాలు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ట‌మాట‌లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టాలి. ట‌మాట ముక్క‌లు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. బంగాళాదుంప‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, పెరుగు వేసి క‌లపాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వేయించిన బంగాళాదుంప‌లు, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి, ప‌చ్చిమిర్చి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధ‌మ్ ఆలూ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts