ఆధ్యాత్మికం

Ananthapadmanabha Swamy Temple : అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య చ‌రిత్ర తెలుసా..? ఈ ర‌హ‌స్యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ananthapadmanabha Swamy Temple &colon; మన దేశంలో శ్రీమహావిష్ణువుకు ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి&period; పాలసముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనిస్తూ ఉన్న రూపాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు&period; ఇక ఈ ఆలయంలో బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది&period; కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవంగా మనకు దర్శనమిస్తున్నాడు&period; కాగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రంలో ఎలా వెలిశాడనేది మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది&period; పూర్వం దివాకరుడు అనే రుషి ఉండేవాడు&period; అతను విష్ణు భక్తుడు&period; అతనికి విష్ణువు ఒక రోజు చిన్న బాలుడి రూపంలో కనిపిస్తాడు&period; ఆ బాలుడు ముద్దులొలుకుతూ ఉండడంతో దివాకరుడు అతన్ని తన ఇంట్లో ఉండాలని కోరుతాడు&period; అయితే ఆ బాలుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని దివాకరుడికి తెలియదు&period; ఈ క్రమంలో ఆ బాలుడు&period;&period; తాను చేసే పనులకు అడ్డు చెప్పకూడదని&comma; ఒకవేళ చెబితే వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతానని షరతు విధిస్తాడు&period; అందుకు దివాకరుడు సరేనంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63119 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;Ananthapadmanabha-Swamy-Temple&period;jpg" alt&equals;"do you know these facts about Ananthapadmanabha Swamy Temple" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఆ బాలుడు దివాకరుడి ఇంటికి చేరుకున్నాక నిత్యం అతన్ని హేళన చేసేవాడు&period; అల్లరి కూడా చేసేవాడు&period; అయినా దివాకరుడు ఆ బాలున్ని ఒక్క మాట కూడా అనేవాడు కాదు&period; అయితే ఒక రోజు దివాకరుడు తపస్సు చేసుకుంటుండగా ఆ బాలుడు వచ్చి సాలగ్రామాలను అతని నోట్లో వేస్తాడు&period; దీంతో దివాకరుడికి పట్టరానంత ఆగ్రహం వస్తుంది&period; అంతే&period;&period; మరుక్షణమే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు&period; అప్పుడే దివాకరుడికి ఆ బాలుడు శ్రీమహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది&period; అయితే ఆ బాలుడు అదృశ్యమవుతూ తనను చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు&period; దీంతో దివాకరుడు స్వామిని వెదుక్కుంటూ వెళతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సముద్ర తీరపాత్రంలో ఓ భారీ వృక్షం శ్రీమహావిష్ణువు రూపంలో అప్పుడే దివాకరుడికి కనిపిస్తుంది&period; అయితే అంతటి పెద్ద రూపాన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పడంతో స్వామి దివాకరున్ని భారీ కాయుడిగా మారుస్తాడు&period; దీంతో దివాకరుడు స్వామి దర్శనం చేసుకుంటాడు&period; అప్పటి నుంచి అక్కడ శ్రీమహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలందుకుంటూ వస్తున్నాడు&period; ఇక ఆ ఆలయంలో టెంకాయలో మామిడికాయను ఉంచి ప్రసాదం ఇస్తారు&period; ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచీ ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-63118" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;Ananthapadmanabha-Swamy-Temple-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో ఉంది&period; ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్‌కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు&period; వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చి చేరిందని చెబుతారు&period; ఇక ఆలయంలోని నేలమాళిగలలో ఉన్న గదుల్లో అన్ని గదులను ఇప్పటికే తెరిచి సంపదను లెక్కించారు&period; కానీ ఒక్క గదిని మాత్రం తెరవలేదు&period; ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉన్నదట&period; దాంతో ఆ గదిని తెరిస్తే అరిష్టాలు జరుగుతాయని విశ్వసిస్తున్నారు&period; అందుకనే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ ఒక్క గదిని తెరవడం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఈ ఆలయంలో ఉన్న తెరవని ఆ ఒక్క గదిలోనే వెలకట్టలేని సంపదతోపాటు ఎన్నో రహస్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది&period; అవన్నీ మనుషుల కంట పడితే ప్రమాదమని&comma; మానవజాతి వినాశనం జరుగుతుందని ప్రచారంలో ఉంది&period; ఈ క్రమంలోనే ఆ గది తలుపులను ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు&period; అయితే భవిష్యత్తులో దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది&period; దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల నుంచి అక్కడికి వెళ్లవచ్చు&period; రైల్వే&comma; బస్సు&comma; విమాన సదుపాయాలు ఉన్నాయి&period; తిరువనంత పురం రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్టులలో దిగితే ప్రైవేటు వాహనాల్లోనూ ఆలయానికి వెళ్లవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts