Bommidayila Pulusu : బొమ్మిడాయిల పులుసును చేయ‌డం ఇలా.. రుచి ఎంతో బాగుంటుంది..

Bommidayila Pulusu : మ‌నం ఆహారంగా చేప‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. ప‌చ్చి చేప‌ల‌తో పాటు ఎండ‌చేప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే ఎండు చేప‌ల్లో బొమ్మిడాయిలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బొమ్మిడాయిల‌తో మ‌నం కూర‌లే కాకుండా ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బొమ్మిడాయిల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ బొమ్మిడాయిల పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకందాం.

బొమ్మిడాయిల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండిన బొమ్మిడాయిలు – 7, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గిన‌న్ని, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bommidayila Pulusu recipe in telugu make in this way
Bommidayila Pulusu

బొమ్మిడాయిల పులుసు త‌యారీ విధానం..

ముందుగా బొమ్మిడాయిల‌ను ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వీటిని క‌ళాయిలో వేసి వేయించాలి. బిమ్మిడాయిల ముక్క‌ల‌ను 5 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత శుభ్రం చేసుకున్న బొమ్మిడాయిల ముక్క‌లు వేసి వేయించాలి. ఈ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ఉల్లిపాయ‌ల‌ను చ‌క్క‌గా వేయించాలి. త‌రువాత కారం వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌లిపి పులుసును మ‌రిగించాలి. దీనిని పొంగు వ‌చ్చి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాయిల పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts