Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో ప‌నీర్ క‌ర్రీ త‌యారీ ఇలా.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తింటారు..

Dhaba Style Paneer Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనితో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌నీర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా కూడా ఉంటాయి. అందులో భాగంగా ధాబా స్టైల్ లో ప‌నీర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Dhaba Style Paneer Curry here it is how to make it
Dhaba Style Paneer Curry

ధాబా స్టైల్ ప‌నీర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ప‌నీర్ – 200 గ్రాములు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ప‌సుపు – చిటికెడు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరి మెంతి – అర టేబుల్ స్పూన్.

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, అనాస పువ్వు – 1, యాల‌కులు – 2, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, బిర్యానీ ఆకు – 1, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, జీడి ప‌ప్పు ప‌లుకులు – 5, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్.

ధాబా స్టైల్ ప‌నీర్ కర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, జీడి ప‌ప్పు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌లిపాలి. వీటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మూత పెట్టి వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె, బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి మాడిపోకుండా క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత ప‌చ్చిబ‌ఠాణీలు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ ను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌నీర్ ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నీటిని పోసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని నూనె పైకి తేలేవ‌ర‌కు క‌నీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్, ఫ్రెష్ క్రీమ్, క‌సూరి మెంతి వేసి క‌లపాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే ధాబా స్టైల్ ప‌నీర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts