Kaju Masala Curry : జీడిప‌ప్పుతో మసాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రోటీల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది..

Kaju Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడి ప‌ప్పు కూడా ఒక‌టి. జీడి ప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీడిప‌ప్పు తిన‌డానికి చాలా రుచిగా ఉంటుంది. నాన‌బెట్టుకుని తిన‌డంతో పాటు జీడిప‌ప్పును వివిధ ర‌కాల వంట‌ల్లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పుతో కూడా వివిధ ర‌కాల వంట‌కాల‌ను స్పెష‌ల్ గా త‌యారు చేస్తూ ఉంటాం. జీడిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో కాజు మసాలా క‌ర్రీ ఒక‌టి. ఈ క‌ర్రీ రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. రెస్టారెంట్ ల‌లో దీనిని మ‌నలో చాలా మంది రుచి చూసే ఉంటారు. అదే రుచితో అదే విధంగా ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ కాజు మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – అర క‌ప్పు, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ కారం – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, పంచ‌దార – పావు టీ స్పూన్, నీళ్లు – 350 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.

Kaju Masala Curry recipe in telugu make in this way
Kaju Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాగా పండిన ట‌మాటాలు – 3, నాన‌బెట్టిన జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2.

కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావల్సిన ప‌దార్థాలు, అలాగే కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పును వేసి చిన్న మంట‌పై రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె, ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌ల‌ను రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం పేస్ట్, కాశ్మీరీ కారం, క‌సూరి మెంతి, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, పంచ‌దార వేసి క‌ల‌పాలి.

ఈ మ‌సాలాల‌ను నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డి నూనె తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత నీళ్లు పోసి పెద్ద మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వేయించిన జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత బ‌ట‌ర్, నెయ్యి, కొత్తిమీర‌, క్రీమ్ వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని నాన్, బ‌ట‌ర్ నాన్, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఎన్ని తిన్నామో తెలియ‌నంత‌గా తినేస్తారు. జీడిప‌ప్పుతో ఈ విధంగా త‌యారు చేసిన క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తినేస్తారు.

Share
D

Recent Posts