Bellam Paramannam : ఎంతో రుచిక‌ర‌మైన బెల్లం ప‌ర‌మాన్నం.. చాలా ఆరోగ్య‌క‌రం..

Bellam Paramannam : మ‌నం వంటింట్లో బెల్లాన్ని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల్లో బెల్లం ప‌ర‌మాన్నం కూడా ఒక‌టి. ఈ బెల్లం ప‌ర‌మాన్నం ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటాం. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా పాలు విర‌గ‌కుండా ప‌ర‌మానాన్ని త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. రుచిగా, చాలా సుల‌భంగా, పాలు విర‌గ‌కుండా బెల్లం ప‌ర‌మానాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం ప‌ర‌మాన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక టీ గ్లాస్, బెల్లం తురుము – ఒక‌టిన్న‌ర టీ గ్లాస్ లేదా త‌గినంత‌, పాలు – 6 టీ గ్లాసులు, నీళ్లు – 2 టీ గ్లాసులు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – కొద్దిగా, జీడిప‌ప్పు – కొద్దిగా, బాదం ప‌ప్పు – కొద్దిగా, ఎండు కొబ్బ‌రి – కొద్దిగా.

know how to make Bellam Paramannam
Bellam Paramannam

బెల్లం ప‌ర‌మాన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో పాల‌ను, నీళ్ల‌ను తీసుకుని పాలు పొంగు వ‌చ్చే వ‌ర‌కు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన త‌రువాత ముందుగా నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వేసి అన్నం మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించుకోవాలి.

ప‌ర‌మాన్నం చ‌ల్ల‌గా అయ్యే కొద్ది గ‌ట్టిప‌డుతుంది. క‌నుక అన్నం మెత్త‌గా ఉడికి కొద్దిగా ద‌గ్గ‌ర‌ప‌డ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులోనే బెల్లం తురుమును వేసి బెల్లం పూర్తిగా క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. త‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం ప‌ర‌మాన్నం త‌యార‌వుతుంది. అన్నం పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బెల్లాన్ని వేయ‌డం వ‌ల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. తీపి తినాలనిపించిన‌ప్పుడు ఇలా బెల్లం ప‌ర‌మాన్నాన్ని చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts