Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ మధ్య కాలంలో సినిమాలు, వ్యాపారం అంటూ చాలా బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈయన వెకేషన్స్కు పెద్దగా వెళ్లరు. అయితే ఇటీవలే కాస్త విరామం చేసుకుని మరీ తన భార్య ఉపాసనతో కలిసి మంచు ప్రాంతాలకు టూర్ వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు పలు చోట్ల తమ వెకేషన్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వీరు వెకేషన్ కోసం విదేశాలకు అయితే వెళ్లలేదు. కాశ్మీర్లోనే మంచు కొండల్లో విహరిస్తున్నారు. దీంతో అక్కడ వారు తీసుకునే ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి.
తాజాగా మంచు కొండల్లో విహరిస్తున్న ఫొటోలను రామ్ చరణ్ షేర్ చేశారు. తన ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా ఆ ఫొటోల్లో ఉన్నారు. మంచు కొండల్లో చలి మంట వేసుకుని ఉన్న ఫొటోతోపాటు ఒక చిన్న ఇంటి లాంటి నిర్మాణం దగ్గర చరణ్ ఫొటో దిగాడు. అలాగే ఒక వీడియోలో చరణ్ చిన్న పాటి గుంతను తవ్వాడు. అందులో ఉన్న నీటిని తాగుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక ఈ మూవీ విడుదల అనంతరం చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొనున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.