ఉదయాన్నే ప్రసరించే సూర్య కిరణాల్లో ఔషద గుణాలుంటాయి. ఉదయాన్నే శరీరం మనసు తాజాగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు శరీరం పడితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయ కిరణాల్లో విటమిన్ ఏ, డి లు పుష్కలంగా ఉండటంతో చర్మ వ్యాదులు దరికి రావు. అంతే కాకుండా నరాల బలహీనత గుండె జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదంలో సూర్యకిరణాలు చాలా ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యంలో రోగికి ఉదయాన్నేసూర్యరశ్మి తాకేలా నిలుచో బెడుతారు. ఏ రకంగా చూసిన సూర్యుడు లేనిదే మనుగడ లేదు.
ఇక సూర్యోదయం సమయంలో ఆచరించే నది స్నానాలకు విశిష్టత లేకపోలేదు. ఈ సమయంలో చేసే స్నానం ఒంటికి మంచిదని చెపుతారు. దీనికి కారణం తెలతెల వారుతుండగా నీటిపై పడే సూర్యకిరణాలు శరీరంలోని రుగ్మతలను దూరం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. సైన్స్ కూడా ఈ విషయాన్ని నమ్ముతుంది. దీనికి కారణం లేలేత సూర్యకిరణాలు నీటిపై పడి ఏడు వర్ణాలుగా మార్పు చెందుతాయని.. ఆ కిరణాలు తిరిగి ఒంటి మీద పడటం వలన సన్ థెరపి జరిగి చర్మ వ్యాధులు గుండెకు, నరాలకి సంబందించిన వ్యాధులు పోతాయి. అయితే ఈ సమయంలో రాగి పాత్రలతో నీటి తర్పణం చేయడం.. స్నానం చేయడం వలన పొటేన్సియల్ పవర్ పెరుగుతుందని సైన్స్ ధృవీకరిస్తోంది. రాగి పాత్రలోని నీటి గుండా సూర్యకిరణాలు ప్రసరించి మైండ్ కు రిలీఫ్ ను కలుగ చేస్తాయని చెపుతోంది.
ఇక హిందు ధర్మశాస్త్రం ప్రకారం.. సూర్యుడిని ఆది దేవుడుగా పూజిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాఃత కాల స్నానం ఆచారిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం వలన పాపాలు తొలగుతాయని నమ్మకం. ఇందులో భాగంగా 1. ఓంః గ్లీమ్ సూర్య ఆదిత్యాయః 2. ఓంః సూర్యయ నమః అనే శ్లోకాలను పఠించడం ఆనవాయితి.