ఆ కుటుంబం 43 ఏళ్లుగా వంకాయ బజ్జీ బిజినెస్ చేస్తోంది. వాళ్లు చేసే బజ్జీ తినడానికి జనాలు క్యూ కడుతుంటారు. ఎక్కడో తెలుసుకోండి. ప్రైవేటు ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంటిపాటునే వ్యాపారం పెట్టుకుని రోజుకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు సంపాదిస్తున్నారు యువకుడు. ఇంతకీ అతను ఏ వ్యాపారం చేస్తున్నాడు. ఇంత ఆదాయం రావటం సాధ్యమేనా అనే విషయాలు తెలుసుకుందాం. 43 సంవత్సరాల నుంచి ఒకే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం వీరిది. వీళ్ళు దగ్గర వంకాయ బజ్జి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ జిల్లా వాసులు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు వంకాయ బజ్జీ వ్యాపారం చేస్తూ నెలకు వచ్చి 60 వేల నుంచి 80 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.
ప్రైవేటు ఉద్యోగం మానేసి వాళ్ళ నాన్న చూపించిన మార్గంలో నడుస్తూ అదే బజ్జీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ దగ్గర లభించే వంకాయ బజ్జీకి జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఇష్టంగా తింటుంటారని సాయి కిరణ్ చెప్పారు. తాజాగా పండించిన వంకాయల్ని రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. వాటిని శుభ్రం చేసి వాటికి కావాల్సిన పదార్థాలను వాళ్లు సొంతంగా తయారు చేసుకున్న మసాలాని వంకాయలకి జోడిస్తారు. వాటిని తాజా నూనెలో వేయించి వంకాయ బజ్జీలని మార్కెట్లో విక్రయిస్తారు.
ఈ బజ్జీలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వంకాయ బజ్జి తినడానికి వస్తుంటారు. రోజుకొచ్చి దాదాపుగా రూ.8 వేల వరకు పెట్టుబడి పెడతామన్నారు. రోజుకొచ్చి రూ.2000 నుంచి రూ.3000 వరకు కూడా ఆదాయం వస్తుందన్నారు. దాదాపుగా 10,000 వేల రూపాయలు వరకు రోజు అమ్మకాలు చేస్తున్నామన్నారు. అంటే నెలకు రూ.3 లక్షల బిజినెస్ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేయాలంటే ఇష్టం లేక వాళ్ళ నాన్న చూపించిన మార్గంలో నడుస్తూ ఈ వ్యాపారం చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ వంకాయ బజ్జీని రాష్ట్రవ్యాప్తంగా ప్రాంచైస్ పెట్టి విక్రయిస్తున్నామని చెప్పారు.