ఆధ్యాత్మికం

ఈ గణేశునికి ఉత్తరం రాస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయట.. ఆలస్యమెందుకు రాసేయండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం అంటేనే దేవాలయాలకు పుట్టినిల్లు&period;&period; ఇక్కడ చాలామంది ప్రజలు గుళ్లను&comma; దేవుళ్లను నమ్ముతుంటారు&period; గుడికి వెళ్లి దేవున్ని ప్రార్ధించి తమ కోరికలు తీరాలని దండం పెడతారు&period;&period; ఇదంతా జరిగేది తంతు&period; కానీ రాజస్థాన్ లోని రణథంబోర్‌లో వినాయక దేవాలయం లో మాత్రం భక్తుల మొక్కులు చాలా విభిన్నంగా ఉంటాయి&period; దేవుడికి ఉత్తరాలు రాస్తూ వారి కోరికలను చెబుతారు&period; కోరికలు కోరడమే కాకుండా ఇంట్లో జరిగే శుభకార్యాలకు గణేశున్ని ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారు&period; ఆ కోరికలు నెరవేరిన కొంత మంది భక్తులు కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయానికి రోజుకు ఇరవై కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట&period; వీటన్నింటిని పూజారులు చాలా ఓపిగ్గా దేవుడి ముందు చదివి వినిపిస్తారట&period; ఆ తర్వాత దేవుడి పాదాల వద్ద అవి ఉంచుతారట&period;&period; అలా దేవుడికి ఉత్తరం రాస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం&period;&period; అయితే ఈ దేవాలయాన్ని పదవ శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించాడని&comma; ఆ కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరుగుతున్న సమయంలో హమీర్ రాజ్యంలోని ఖజానా అంతా తుడిచిపెట్టుకుపోతుంది&period; ఈ విధంగా ఏడేళ్లపాటు యుద్ధం జరిగగా తనకు ఓటమి తప్పదని అనుకుంటాడు హమీర్&period;&period; కానీ ఆయన గొప్ప వినాయక భక్తుడు&period; ఒకరోజు హమీర్ కలలో వినాయకుడు కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది&comma; నువ్వే గెలుస్తావ్ అని చెప్పి నీ సమస్యలు తొలగిపోతాయని అన్నారట&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76966 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;temple-in-rajasthan&period;jpg" alt&equals;"this temple in rajasthan devotees write letters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ మరుసటి రోజు గణేశుడు కనిపించి చెప్పిన మాటలు నిజమయ్యాయి&period;&period; అంతేకాకుండా హమీర్ కోట గోడకు చెక్కిన శిల్పం లా విఘ్నేశ్వరుడి ప్రతిమ వెలసిందట&period; ఆ విగ్రహానికి మూడు కళ్ళు ఉన్నాయట&period;&period; హమీర్ విగ్రహాన్ని చూసిన వెంటనే అక్కడ ఒక గుడి నిర్మించారు&period;&period; ఆ గుడి ఇప్పుడు వేలాది మంది భక్తులకు కొంగు బంగారంగా మారింది&period; వినాయకుడికి మూడు కన్నులు ఉండటంవల్ల త్రినేత్ర విఘ్నేశ్వరుడు అని పిలుస్తుంటారు&period; ఆ దేవాలయమే రణతంబోర్ దేవాలయం&period;&period; మీరు కూడా మీ కోరికలను ఉత్తరాలుగా పంపాలనుకుంటే ఈ చిరునామాకు పంపేయండి&colon; రణతంబోర్ త్రినేత్ర గణేష్ టెంపుల్&comma; సవాయి మధోపూర్&comma; రాజస్థాన్ -322021&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts