ఆధ్యాత్మికం

పితృ ప‌క్షాలు అంటే ఏమిటి..? వాటి వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పితృ తర్పణ రోజుల్లో హిందువులు తమ పెద్దవారిని తలచుకుని వారికి శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు వదులుతారు&period; ఈ పితృ తర్పణ రోజుల్లో గతించిన పెద్దలని పూజిస్తే తమ పూర్వీకులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తారని నమ్మకం&period; సెప్టెంబ‌ర్‌&comma; అక్టోబ‌ర్ నెల‌ల్లో ఈ రోజులు à°µ‌స్తుంటాయి&period; గతించిన పెద్దల ప్రీతి కొరకు తర్పణము&comma; పిండ ప్రదానం చేస్తారు&period; పితృ పక్షాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి&period; ఆత్మ కి నాశనం లేదు అని భగవద్గీత చెప్తోంది&period; ఆత్మ మరణించడం లేదా మరలా జన్మించడం ఉండదు&period; మనలో ఉన్న ఆత్మ దేనివల్లా కూడా నాశనం చేయబడదు&period; అది శాశ్వతమైనది&period; ఆత్మ యొక్క ధ్యేయం ముక్తిని లేదా మోక్షాన్ని పొందడమే&period; శ్రాద్ధ కర్మల వల్ల గతించిన పెద్దల ఆత్మకి శాంతి కలిగి సృష్టి కర్తలో లీనమవ్వడానికి సహాయ పడతాయి&period; పితృ పక్షాలలో తర్పణం వదలడం వల్ల బ్రతికి ఉన్నవారు గతించిన తమ పెద్దలకి చేయవలసిన కర్మలు చేయకపోవడం వల్ల కలిగే పాపం నుంచి బయటపడతారు&period; అందువల్ల అత్యంత శ్రద్ధా భక్తులతో గతించిన పెద్దలకి తర్పణాలు వదలుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన కర్ణుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి ఆహారంగా బంగారం&comma; వెండి&comma; వజ్రాలనిచ్చారు&period; ఇది చూసిన కర్ణుడు తాను బ్రతికుండగా దానాలు చేసాననీ అయినా తనకి ఆహారంగా వీటిని ఎందుకిచ్చారని ఇంద్రుని ప్రశ్నిస్తాడు&period; దానికి ఇంద్రుడు&comma; నువ్వు దాన కర్ణుడివే&comma; కానీ ఎల్లప్పుడూ కేవలం నీ సంపదలని మాత్రమే దానం చేసావుగానీ పితృ దేవతలకి శ్రద్ధా భక్తులతో నమస్కరించలేదనీ&comma; వారి ప్రీతి కొరకు ఆహారం సమర్పించలేదు కాబట్టి నీకు కూడా నువ్వు దానం చేసినవే ఆహారంగా ఇచ్చాము అంటాడు&period; తనకి ఈ పితృ పూజలు తెలీవు కావున ఎప్పుడూ తర్పణాలు విడిచిపెట్టలేదని చెప్పిన కర్ణునికి ఇంద్రుడు పదహారు రోజులు తిరిగి భూమి మీద జన్మించి పితృ కార్యాలు నిర్వర్తించమని చెప్పాడు&period; ఈ పదహారు రోజులూ పెద్దల ఆత్మలు భూమి మీదకి వచ్చి తమ వారసులు ఇచ్చిన తర్పణాలు పుచ్చుకుని వారిని ఆశీర్వదిస్తారని నమ్మకం&period; తర్పణాలు వదలడానికి కొన్ని ప్రాశస్త్యమైన ప్రదేశాలున్నాయి&period; ఆయా ప్రదేశాలలో ప్రత్యేక శక్తులుండటం వల్ల అక్కడ విడిచే తర్పణాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది&period; అలాంటి స్థలాలు ప్రయాగ&comma; వారణాశి&comma; కేదార్‌నాధ్&comma; గయ&comma; రామేశ్వరం&comma; బదరీనాధ్&comma; కపాల్ మోచన్ సేష్ అంబాడీ&comma; నాసిక్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91464 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pithru-pakshalu&period;jpg" alt&equals;"what are pithru pakshalu and how do they effect us " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబ పెద్ద లేదా పెద్ద కొడుకు తర్పణాలని వదలాలి&period; అలా కుదరని పక్షంలో కుటుంబంలోని మగవారెవరైనా చెయ్యవచ్చు&period; శ్రాద్ధ కార్యక్రమంలో తమ భావాలని అదుపులో ఉంచుకోవడం చాల ముఖ్యం&period; తమ కోపాన్ని అదుపులో ఉంచుకునే శక్తినిమ్మని భగవంతుణ్ణి ప్రార్ధించాలి&period; పైన చెప్పిన ముఖ్య స్థలాలలో శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాని పక్షంలో బ్రాహ్మణులని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం&comma; బట్టలు&comma; దక్షిణతో కూడిన తాంబూలాన్ని అందించాలి&period; అర్హుడైన బ్రాహ్మణునికి అందించినదేదైనా గతించిన పెద్దల ఆత్మలని చేరుతుందని విశ్వాసం&period; శ్రాద్ధ కర్మ చేశాక కాకికి ఆహారాన్ని అర్పిస్తారు&period; పెద్దలు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్మకం&period; ఆ తర్వాత కుక్కలు&comma; ఆవులకి కూడా ఆహారాన్ని అందిస్తారు&period; పితృ దోషాలు చేసినట్లయితే మహాదానం చేయడం వల్ల దాని నుంచి ముక్తి పొందవచ్చు&period; దీనివల్ల పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పితృ పక్షాలలో కొత్త బట్టలు కొనడం&comma; పెళ్లిళ్లు వంటి శుభ కార్యాలు చేయ‌డం&comma; జుట్టు కత్తిరించుకోవడం చేయ‌కూడ‌దు&period; మద్యం&comma; మాంసానికి దూరంగా ఉండాలి&period; పొగాకు నిషిద్ధం&period; అలాగే ఈ పితృ పక్షాల సమయంలో ఇతరుల ఇంట్లో భుజించకూడదు&period; అలా చేస్తే మీకు ఉప్పు ఋణం వస్తుంది&period; అందువల్ల వారి పితృ దోషాలు మీకు బదిలీ అవుతాయి&period; ఈ దోష పరిహారార్ధం దోష నివారణ పూజలు చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts