ఆధ్యాత్మికం

తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసా!!

<p style&equals;"text-align&colon; justify&semi;">కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు&period; ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు&period; తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర&period; స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత&period; స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు&period;&period; విశేషాలు&comma; వింతలు ఉన్నాయి&period; అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా&quest; ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా&quest; ఆ విషయాలు… శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతయ్య &lpar;అనంతాళ్వారు&rpar;&period; ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్&period; ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు&period; ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు&period; ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని&comma; మొదలు పెడతాడు&period; ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు&period; చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు&period; అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది&period; అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు&period; గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు&period; దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు&period; ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79384 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;srivaru&period;jpg" alt&equals;"what is the story behind tirumala srivaru beard pacha karpuram " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది&period; దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు&period; అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు&period; అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది&period; దాంతో బాలుడు రూపంలో వచ్చిన వేంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు&period; ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు&period; దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు&period; గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు&period; తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు&period; గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి నుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు&period; అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది&period; శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు&period; అదండీ స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ&period; ఈసారి స్వామిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తుచేసుకోండి&period;&period; స్వామి వారికి తన భక్తుల గాథను తల్చుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts