వినోదం

భైర‌వ‌ద్వీపం సినిమా విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. అస‌లు విష‌యం ఇదే..!

9 నంది అవార్డులు సొంతం చేసుకుని,మరోవైపు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన బాలకృష్ణ సూప‌ర్ హిట్ సినిమా భైరవ ద్వీపం. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా రాకుమారి పాత్రలో నటించి మెప్పించింది. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ సాధించింది.. ఆదిత్య 369` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి. అయితే ఈ సినిమా సెన్సార్ విష‌యంలో పెద్ద ర‌చ్చే జ‌రిగింది.

ఈ సినిమాలో గుర్రాల‌కు బాణాలు త‌గిలి కింద‌ప‌డే కొన్ని సీన్ లు ఉన్నాయి. భైర‌వ‌ద్వీపం సినిమాలోని స‌న్నివేశాల‌కి సంబంధించిన సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం తెలుపుతూనే…సినిమాలో గుర్రాల‌కు బాణాలు త‌గిపి కింద‌పడిపోతున్న స‌న్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలకు అట‌వీశాఖ వాళ్లు, బ్లాక్రాస్ వాళ్లు అభ్యంత‌రం తెలిపితే మాత్రం సీన్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చార‌ట‌. కానీ సినిమా విడుద‌ల త‌ర‌వాత ఎలాంటి అభ్యంత‌రాలు రాక‌పోగా సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి కేఆర్ విజయ బాలకృష్ణ కు తల్లిగా నటించారు.

bhairawa dweepam movie interesting facts to know

విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక జరిగిన ఆసక్తికర విషయం ఇపుడు బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ శాపానికి గురవ్వడం వల్ల కురూపి గా మారుతాడు. ఇక బాలకృష్ణను అలా చూడలేని అభిమానులు థియేటర్లో కుర్చీలూ విరిచి విధ్వంసం చేశారట.ఇక వెంటనే దర్శకనిర్మాతలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరించారట.అయితే అప్పట్లో ఒక కమర్షియల్ మాస్ ఇమేజ్ ఉన్నా హీరో ఒక కురూపి వేషం వేయడం రిస్క్ తీసుకోవడమే అలాంటిది బాలయ్యబాబు చేయడం హిట్ కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తాయి.

Admin

Recent Posts