వినోదం

న‌ర‌సింహనాయుడు క‌హానీ.. టైటిల్‌తో పాటు క‌థ మొత్తం మార్చ‌డానికి కార‌ణం ఏంటి..?

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారి స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు అనే చెప్పాలి. అప్పట్లో బాలకృష్ణ సినిమా అంటే రాష్ట్రమంతా ఒక రేంజ్ లో హడావుడి ఉండేది. ఇక సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే తప్పకుండా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇక ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నరసింహానాయుడు ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిమ నరసింహా నాయుడు సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అత్యదిక ప్రాఫిట్స్ అంధించిన సినిమాల లిస్ట్ తీస్తే ఇది కూడా అందులో ఉంటుంది. 2001లో ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దర్శకుడు బి.గోపాల్ , బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. అనంతరం రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ట్రెండ్ సెట్ చేసింది. ఇక మూడవసారి వచ్చిన నరసింహానాయుడు అయితే అంతకు మించి అనేలా కాసుల వర్షాన్ని కూరిపించింది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, కే .విశ్వనాథ్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల‌లో నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సినిమాకు ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించిన సంగతి తెలిసిందే. సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించిన ఈ సినిమా విషయంలో తెర వెనక చాలా కథ నడిచింది.

interesting facts behind narasimha naidu movie story

మొదట బి. గోపాల్… పోసాని కృష్ణమురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమా తెర‌కెక్కించాలని భావించారు. ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశానికి కూడా తీశారు. ముహూర్తపు సన్నివేశం చూసేందుకు బాలయ్య బాబు అభిమానులు భారీగా స్టూడియోకు చేరుకొవ‌డంతో బాల‌య్య‌తో తాను చేయ‌బోయే మూడో సినిమా కూడా హిట్ ఇవ్వాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో చిన్ని కృష్ణకు ఫోన్ చేసి కథను రెడీ చేయాలని చెప్పారు. దాంతో చిన్ని కృష్ణ బీహార్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సినిమా కథను రాసుకున్నారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ సినిమాకు మాటలు రాయడంతో పాటు చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచించారు. దాంతో అయోధ్య రామయ్య కథను పక్కనపెట్టి నరసింహనాయుడు సినిమా తెర‌కెక్కించారు.

Admin

Recent Posts