వివిధ సమయాలలో మనం వివిధ భావాలు కలిగి వుంటాం. కోపం, విచారం, సంతోషం మొదలైనవి రోజువారీ చర్యలలో ప్రతిబింబిస్తూంటాయి. అయితే ఈ రకమైన భావాలు మనం తినే ఆహారాలను బట్టి కూడా వుంటాయి. ఏ ఆహారాలు తింటే ఎలా వుంటారనేది పరిశీలించండి. ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే, మీ విచారం, కోపం వంటివి దూరమై, ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది.
ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తారు. ప్రత్యేకించి గుండెకు ఫిష్ ఆయిల్ చాలా మంచిది. ఫిష్ ఆయిల్స్ తో మరో ప్రయోజనం అవి మెదడు లోని ఆలోచనలను కూడా ప్రభావింప జేస్తాయి. ఫిష్ ఆయిల్స్ లోపంతో మెదడులోని ఆలోచనలలో అధికంగా వ్యతిరేక ఆలోచనలు పుడతాయని కూడా ఒక తాజా పరిశోధన వెల్లడించింది.
అరటి పండులో అధికంగా కార్బో హైడ్రేట్లు వుంటాయి. సహజమైన షుగర్ కల కార్బో హైడ్రేట్లు తిన్న వెంటనే మీకు శక్తి కలిగిస్తాయి. అరటి పండులోని ట్రిప్టో ఫాన్ ఎమినో యాసిడ్ లు మీలోని సెరోటోనిన్ లెవెల్స్ పెంచి ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాయి. మూడ్ బాగా లేదనుకునేవారు పై ఆహారాలను తింటే రోజంతా వారి కార్యకలాపాలను ఉత్సహంగా చేసుకోవచ్చు.