mythology

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మ‌ట్టి కుండ‌లోనే ఎందుకు నైవేద్యం పెడ‌తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వజ్ర వైఢూర్యాలతో&comma; మరకత మణి మాణిక్యాల నడుమ తులతూగే శ్రీవేంకటేశ్వరుడు రోజూ స్వీకరించే ప్రసాదం తయారు చేసే పాత్ర ఏమై ఉంటుంది&quest; వెండి&comma; బంగారు గిన్నెల్లో వండుతారని అనుకుంటాము కదా&excl; కానే కాదు&period; ఆ మహిమాన్వితుడు కూడా అందరిలానే మామూలు మట్టి కుండలో వండిన ప్రసాదమే స్వీకరిస్తాడు ఇప్పటికీ&period; అందులోనూ కట్టెలపొయ్యి మీద వండితేనే ఆయనకి అత్యంత ఇష్టం&period; ఇది వందల ఏళ్లనాటి ఆచారం&period; సంపద పెరిగినా ఆయన అభిరుచి మారలేదు&period; ఒళ్ళంతా బంగారమే అయినా ఆయన మనసు మమతల మట్టే&period; శ్రీవారి సన్నిధికి ఆగ్నేయంలో అన్నప్రసాద తయారీ శాల ఉంది&period; అక్కడ కట్టెల పొయ్యి మీద మట్టికుండలో రోజూ ప్రసాదం తయారుచేస్తారు&period; దీనిని ఓడు ప్రసాదం అని కూడా అంటారు&period; ఇక్కడ తయారుచేసిన దద్ద్యోజనం స్వామివారికి నైవేద్యంగా పెడుతారు&period; తోమాల&comma; అర్చన అనంతరం స్వామి ప్రసాదం స్వీకరిస్తాడు&period; తొలుత పుష్కరిణి వద్దవున్న వరాహస్వామికి ప్రసాద నైవేద్యం సమర్పించిన తరువాతనే స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే విధంగా రాత్రి వేళలలో కూడా నైవేద్య కార్యక్రమం ఉంటుంది&period; వంటశాల వద్ద స్వామివారి తల్లి అయిన వకుళమాత పర్యవేక్షణలో ప్రసాదాలు తయారు చేస్తారు&period; ఏ బిడ్డకైనా అమ్మ చేతి వంట రుచే కదా నచ్చేది&period; మరి మొదటి నైవేద్యం కట్టెల పొయ్యిలో సరే&comma; మరి మట్టి కుండలోనే ఎందుకు పెడుతారు అంటే ఈ కథ చదవాల్సిందే&&num;8230&semi; ఇది వరకు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట&period; అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా&period; ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట &&num;8211&semi; స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను&period; పైగా&comma; నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట&period; స్వామి వారికి చిరాకు వేసి తొండమాన్ చక్రవర్తికి ఒక పాఠం చెప్పాలని&comma; నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు&period; వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి&period; మరుసటి రోజు వెళదాం అని అనుకుని&comma; స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91786 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-venkateshwara-2&period;jpg" alt&equals;"why matti kunda naivedyam for lord venkateshwara " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు&comma; తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద&comma; మట్టి తులసిదళాలు కనిపించాయుట&period; స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు&comma; ఆ భీముడు సమర్పించినవే అన్నాడట&period; అప్పుడు తొండమాన్ తన మనసులో అనుకున్నాడుట&comma; మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా&comma; వీరు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట&period; ఆ రోజు చాల ఎండగా ఉంది&comma; అప్పటికే నడిచి నడిచి&comma; భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట&period; అప్పుడు ఆ భీముడే&comma; తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట&period; తొండమాన్ చక్రవర్తి అడిగాడుట&comma; ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు&quest; వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం&period; వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు&quest; అప్పుడు భీముడు అన్నాడు&comma; నేనేం చేస్తాను స్వామి&comma; కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు&period; కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు&period; అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు&period;వాటి వల్ల నా సంసారం సాగుతోంది&period; నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ పని మొదలుపెట్టినా గోవింద నేను చేయడమేమిటి&quest; నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట&quest; అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట&comma; వీడేమో &&num;8211&semi; అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు&comma; నేనేమో &&num;8211&semi; నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను&period; ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం&period; భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి&comma; అందులో అన్నం ముద్ద పెట్టి&comma; స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట&period; స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి&comma; భూదేవి సహితుడై&comma; దివ్య విమానం లోంచి దిగి&comma; భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట&period; వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని&comma; భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి&comma; తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు&period; అలాగే శ్రీదేవి&comma; భూదేవి అమ్మవార్లు&comma; వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట&period; స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా&comma; వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు&period; ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం&period; ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు&period; అదొక్కటే తింటారు స్వామి వారు&period; ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి&period; ఎక్కడ గర్వం&comma; అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు&period; సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన&period; ఈశ్వరా ఇదంతానీ సృష్టే తండ్రి&comma; నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట&period; మరి నిజమే కదండీ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts