Aloo Bathani Masala Curry : ఎప్పుడూ చేయ‌ని విధంగా ఆలుక‌ర్రీని గ్రేవీతో ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Aloo Bathani Masala Curry : బంగాళాదుంప‌లు, ప‌చ్చిబ‌ఠాణీలు క‌లిపి మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలాసులభంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆలూ బ‌ఠానీ మ‌సాలా క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎతో రుచిగా ఉండే ఈ ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 4, ఉడికించిన బంగాళాదుంప‌లు – 4( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిబ‌ఠాణీ – అర క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరిమెంతి – అర టీ స్పూన్.

Aloo Bathani Masala Curry recipe make in this way
Aloo Bathani Masala Curry

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత బ‌ఠాణీ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు బ‌ఠాణీలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. బ‌ఠాణీలు ఉడికిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. తరువాత స‌గం బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత మిగిలిన బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. కూర చ‌క్క‌గా ఉడికిన త‌రువాత కొత్తిమీర‌, క‌సూరిమెంతి వేసి కలిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పూరీ, పుల్కా, వెజ్ బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts