Beans Curry : బీన్స్ క‌ర్రీని ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Beans Curry : బీన్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే వీటితో కూర‌లు కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఎక్కువ‌గా బీన్స్ తో వేపుడు కూర‌లనే త‌యారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా బీన్స్ తో మ‌నం మ‌సాలా కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. బీన్స్ తో మ‌సాలా కూర‌ను రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీన్స్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీన్స్ – పావు కిలో, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం పొడి – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్ , గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్.

Beans Curry recipe in telugu very tasty if you make like this
Beans Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్.

బీన్స్ మ‌సాలా కర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పెరుగు త‌ప్ప మిగిలిన మ‌సాలా దినుసుల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పెరుగును వేసి మెత్త‌గా పేస్ట్ గా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బీన్స్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత అందులో మ‌సాలా పేస్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత వేయించుకున్న బీన్స్, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా, కొత్తిమీర, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పులావ్, వెజ్ బిర్యానీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కూర‌ను ఇంకా కావాల‌ని అడిగి మ‌రీ తింటారు. వేపుడు కూర‌లే కాకుండా ఈ విధంగా బీన్స్ తో అప్పుడ‌ప్పుడూ మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts