Egg Masala Gravy Curry : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Egg Masala Gravy Curry : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ కూర దేనితో తిన‌డానికైనా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఎగ్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3, పెరుగు – ఒక క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Egg Masala Gravy Curry recipe in telugu mouth watering dish
Egg Masala Gravy Curry

ఎగ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ను నిలువుగా రెండు భాగాలుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఫ్రైడ్ ఆనియ‌న్స్ జార్ లో వేసి మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత అందులో ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు, పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి.

త‌రువాత క‌ట్ చేసుకున్న కోడిగుడ్ల‌ను వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాల త‌రువాత కోడిగుడ్ల‌ను మ‌రో వైపుకు తిప్పి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత క‌సూరి మెంతి వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్, బిర్యానీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts