Mushroom Masala : పుట్ట గొడుగుల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Mushroom Masala : పుట్ట‌గొడుగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పుట్ట గొడుగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవస‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పుట్ట‌గొడుగుల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ పుట్ట‌గొడుగుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ పుట్టగొడుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంతో తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచితో పాటు సుల‌భంగా అయ్యే విధంగా మ‌ష్రూమ్ మ‌సాలా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు- 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగినఉల్లిపాయ‌లు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌సుపు – అర టీస్పూన్, కాశ్మీరి కారం- 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, త‌రిగిన పుట్ట గొడుగులు – పావుకిలో, నీళ్లు – అర‌ గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mushroom Masala recipe in telugu make in this way
Mushroom Masala

మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, జీల‌క‌ర్ర‌, బిర్యానీఆకు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాతఅల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కారం, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

త‌రువాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మూత పెట్టి 3 నిమిషాల‌పాటు ఉడికించాలి. త‌రువాత పుట్ట‌గొడుగులు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts