Panasa Pandu Payasam : ప‌న‌స తొన‌ల‌తో పాయ‌సం.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో క‌మ్మగా ఉంటుంది..!

Panasa Pandu Payasam : మ‌నం వంటింట్లో వివిధ రుచుల్లో పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాము. పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పాయ‌సం వెరైటీల‌లో ప‌న‌స తొన‌ల పాయ‌సం కూడా ఒక‌టి. ప‌న‌స తొన‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ప‌న‌స తొన‌ల‌తో మ‌నం మ‌రింత రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. పంచ‌దార వాడ‌కుండా ఈ ప‌న‌స తొన‌ల పాయసాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న‌స తొన‌ల పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొబ్బ‌రి పాలు – రెండు క‌ప్పులు, ప‌న‌స తొన‌లు – 7, నెయ్యి – 2 టీ స్పూన్స్, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఉప్మా ర‌వ్వ – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము – పావు క‌ప్పు, యాల‌కుల పొడి -ఒక టీ స్పూన్.

Panasa Pandu Payasam recipe in telugu make in this way
Panasa Pandu Payasam

ప‌న‌స తొన‌ల పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ప‌న‌స తొన‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక డ్రై ప్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ర‌వ్వ కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌న‌స తొన‌లు వేసి క‌లపాలి.త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ప‌న‌స తొన‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత ర‌వ్వ‌, పావు క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి ర‌వ్వ‌ను మెత్త‌గా ఉడికించాలి.

త‌రువాత బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. బెల్లం క‌రిగిన తరువాత కొబ్బ‌రి పాలు పోసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌న‌స తొన‌ల పాయ‌సం త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా పంచ‌దార‌ను వాడ‌కుండా కూడా రుచిగా మ‌నం పాయ‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వెగ‌న్ ఫుడ్ డైట్ ఫాలో అయ్యే వారు ఈ విధంగా కొబ్బ‌రిపాల‌తో రుచిగా పాయసాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts