Rashmika Mandanna : తమిళ స్టార్ నటుడు విజయ్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం.. బీస్ట్. ఈ సినిమాలోంచి ఇటీవలే అరబిక్ కుత్తు అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ఈ పాట యూట్యూబ్లో సంచలనాలను సృష్టిస్తోంది. ఈ సాంగ్కు ఇప్పటికే 150 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటకు ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు డ్యాన్స్ లు చేశారు.
అరబిక్ కుత్తు సాంగ్కు సమంత, కీర్తి సురేష్లు ఇప్పటికే డ్యాన్స్ చేసి అలరించారు. సమంత ఈ పాటకు ఎయిర్ పోర్టులో డ్యాన్స్ చేసి అలరించింది. ఈ క్రమంలోనే ఈ జాబితాలో తాజాగా రష్మిక మందన్న కూడా చేరిపోయింది. ఆమె అరబిక్ కుత్తు పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. షార్ట్స్ ధరించి అందాలను చూపిస్తూ ఈమె చేసిన డ్యాన్స్ చూస్తుంటే మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక మందన్న చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే ఈ పాటకు సమంత డ్యాన్స్ చేయగా.. ఆమెకు డబ్బులు ఇచ్చి చిత్ర యూనిట్ పెయిడ్ ప్రమోషన్గా అలా చేయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమంత కూడా స్పందించలేదు. ఇక రష్మిక మందన్న ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో అది వైరల్గా మారింది. ఈమె ప్రస్తుతం రెండు బాలీవుడ్ మూవీల్లో నటిస్తోంది. అందుకని ముంబైలోనే ఉంటోంది.
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రష్మిక మందన్న మిషన్ మజ్ను అనే సినిమాలో నటించింది. అలాగే గుడ్ బై అనే మరో మూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక తెలుగులో రష్మిక మందన్న పుష్ప 2లో త్వరలో నటించనుంది. ఈ సినిమాకు గాను లొకేషన్స్ను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.