ఆధ్యాత్మికం

Dhwaja Sthambham : గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhwaja Sthambham &colon; మనలో చాలా మందిమి గుడికి వెళ్తుంటాం&period; మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం&period; గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది&period; మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం&period; కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకుంటుంది అని ఆలోచించారా&period; గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది&period; కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు&period; ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తిగా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు&period; అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు&period; అందుకని అశ్వమేధ యాగం చేసి à°¶à°¤‌ృరాజులను గెలిచి దేవతలను&comma; బ్రాహ్మణులను గెలిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని కోరతాడు&period; ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి&comma; యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది&period; ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు&period; ఆయన మహా పరాక్రమ వంతుడు&comma; గొప్ప దాతగా పేరుగాంచినవాడు&period; మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు&comma; పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు&period; తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు&comma; భీమార్జునులు ఓడిపోతారు&period; తమ్ముళ్లందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరతాడు&period; అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుద్ధంలో జయించడం సాధ్యంకాదనీ&comma; కపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు&period; శ్రీకృష్ణుడు&comma; ధర్మరాజు కలసి ముసలి బ్రాహ్మణుల రూపంలో మణిపురం వెళ్తారు&period; వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి శ్రీకృష్ణుడు&period;&period; రాజా&period;&period; మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది&period; బాలుని విడిచి పెట్టవలసినదిగా మేము ప్రార్థించగా&comma; సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన‌ మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యా పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందనీ&comma; కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు&period; వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యా కొడుకులకు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు&period; వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58269 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dhwaja-sthambham&period;jpg" alt&equals;"why Dhwaja Sthambham in temples what is the story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు&period; అందుకు మయూరధ్వజుడు&comma; మహాత్మా తమరు పొరపడుతున్నారు&period; బాధతో నా శరీరాన్ని మీకివ్వటం లేదు&period; నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది&comma; కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది&period;&period; అని వివరిస్తాడు&period; మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజా&comma; నీ దానగుణం అమోఘం&period;&period; ఏదైనావరం కోరుకో&period;&period; అంటాడు&period; పరమాత్మా&period;&period; నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి&period;&period; అని కోరుతాడు మయూరధ్వజుడు&period; అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని అంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మయూరధ్వజా&period;&period; నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి&period; వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ&comma; నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది&period; ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వతనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు&period; ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది&period; నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది&period;&period; అంటూ చెబుతాడు&period; అప్పటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది&period; భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది&period; ఇదీ&period;&period; ధ్వ‌జ‌స్తంభం వెనకున్న అస‌లు క‌à°¥‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts