మీరు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, రహదారి పక్కన మైలురాళ్లను చూసి ఉంటారు. మైలురాళ్ళు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు వంటి విభిన్న రంగులతో ఉండటాన్ని గమనించి ఉంటారు. ఈ మైలురాళ్లు ఈ రంగుల్లోనే ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దానికి ప్రధాన కారణం ఏంటో చూద్దాం.. ప్రయాణం చేస్తున్నప్పుడు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఖచ్చితమైన దూరాన్ని తెలుసుకోవడానికి, ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్లలో GPS పై చాలామంది ఆధారపడుతున్నారు. అయినా మైలురాళ్లకు ప్రాముఖ్యత తగ్గడం లేదు. గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం ఎంత దూరం ప్రయాణించాలో తెలియజేయడమే కాకుండా, ఒక మైలురాయి కొన్ని ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఈ సమాచారం దాని రంగుల్లోనే తెలప బడుతుంది.
ఈ మైలురాళ్ల యొక్క కింది భాగం యొక్క రంగు తెలుపు అయితే, ఎగువ భాగం ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఒక మైలురాయిని గుర్తిస్తే, దాని పైభాగం పసుపు రంగులో ఉంటే మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారని అర్థం చేసుకోవాలి. 2021 నాటికి, భారతదేశంలో జాతీయ రహదారి నెట్వర్క్ మొత్తం పొడవు 1,51,019 కిలోమీటర్లు. అలాగే మీకు ఆకుపచ్చ స్ట్రిప్తో మైలురాయి కనిపిస్తే మీరు రాష్ట్ర రహదారి వెంట ప్రయాణిస్తున్నారని అర్థం.
నీలం లేదా నలుపు, తెలుపు స్ట్రిప్తో మైలురాళ్లను దాటిన సందర్భంలో, మీరు నగరం లోపల లేదా జిల్లా రహదారి వెంబడి ప్రయాణిస్తున్నారని అర్థం చేసుకోవాలి. భారతదేశ జిల్లా రహదారి నెట్వర్క్ పొడవు 5,61,940 కిలోమీటర్లు. ఆరెంజ్ స్ట్రిప్తో మైలురాయి ఉన్న రోడ్డు వెంబడి ప్రయాణించి నట్లయితే, మీరు ఒక గ్రామ రహదారిలో ప్రయాణిస్తున్నారని సూచిస్తుంది. గ్రామ రహదారి నెట్వర్క్ పొడవు 3.93 లక్షల కిలోమీటర్లు.