mythology

అశ్వ‌త్థామ ఎంత‌టి ఘోరం చేశాడో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం&period; ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం&period; అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి&period; నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం&period; దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు&period; ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు&comma; అర్జునుడు&comma; అశ్వత్థామ తదితరులు ఉన్నారు&period; అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం&comma; ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు&period; ఇక అశ్వత్థామ విషయానికి వస్తే అస్త్రప్రయోగం తెలుసుకాని ఉపసంహారం తెలియదు&period; అదే భారతయుద్ధంలో ఒక మలుపు తిప్పిన ఘటన&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత యుద్ధంలో దుర్యోధనుడు తీవ్రగాయాలు అయిన తర్వాత అశ్వత్థాముడు&comma; కృపాచార్యుడు తదితరులు దుర్యోధుని వద్దకు వస్తారు&period; ఆ సమయంలో పాండవులను సంహరించి వస్తానని ప్రతిజ్ఞచేస్తాడు అశ్వత్థాముడు&period; అదేరోజు రాత్రిపూట స్వామి భక్తితో అశ్వత్థామ పాండవుల సైన్య శిబిరంలో చాలామందిని చంపివేస్తాడు&period; దానిలో ఉపపాండవులు కూడా ఉంటారు&period; అంటే పాండవుల కొడుకులు&comma; మనవలు&period; మరుసటి రోజు ఉదయాన ఈ విషయం పాండవులకు తెలుస్తుంది&period; అప్పుడు భీముడు అశ్వత్థామను చంపడానికి సిద్ధమయి వెళ్తాడు&period; కానీ అశ్వత్థామ అస్త్ర నిపుణుడు భీముని సంహరించగలడని తెలిసి ధర్మార్జున&comma; నకులలను తోడు తీసుకుని భీముడు&comma; అశ్వత్థాములు యుద్ధం చేసే దగ్గరికి వెళ్తారు&period; అది గమనించిన అశ్వత్థాముడు అర్జునుని యుద్ధంలో ఓడించడం కష్టమని భావించి బ్రహాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు&period; వెంటనే కృష్ణుని ఆదేశంతో అర్జునుడు కూడా బ్రహాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు&period; ఆ రెండు దివ్యాస్ర్తాలు ఆకాశాన పోరాడుచుండెను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77996 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ashwathama&period;jpg" alt&equals;"do you know what ashwathama did " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారద&comma; వేదవ్యాసుల ఇద్దరికి అస్ర్తాలను ఉపసంహరించుకోమని ఆజ్ఞాపిస్తారు&period; అర్జునుడు ఉపసంహరించాడు&period;కానీ ఉపసంహారం తెలియని అశ్వత్థామ ఏమి చేయలేదు&period; దీంతో అది ఉత్తర గర్భంలో శిశువును సంహరిస్తుంది&period; వెంటనే శ్రీకృష్ణుడు ఆ శిశువును తన శక్తితో బతికిస్తాడు&period; పరిరక్షించబడిన ఉత్తర శిశువే పరీక్షుత్తు&period; తదనంతర కాలంలో ధర్మరాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలి మహారాజుగా కీర్తిగడించాడు&period; ఇక ఆ యుద్ధంలో అర్జునుడు విజృంభించి అశ్వత్థామను ఘోరంగా ఓడిస్తాడు&period; గురువు పుత్రుడు కాబట్టి సంహరించకుండా కృష్ణుని ఆదేశం ప్రకారం శిరోముండనం చేసి ఆయన తల్లి దగ్గర పడవేస్తారు పాండవులు&period; ఇదండి బ్రహ్మాస్త్ర ప్రయోగం- శాపం- తదనంతర పరిణామాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts