iPhone : కేవ‌లం రూ.15,498కే ఐఫోన్..!

iPhone : టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 వేరియెంట్ ను వినియోగ‌దారులు చాలా త‌క్కువ ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ-కామర్స్ సైట్ల‌లో ఈ ఫోన్ చాలా త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. అయితే ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి పూర్తి స్థాయిలో డిస్కౌంట్‌ను పొందితే అప్పుడు ఈ ఫోన్ ధ‌ర రూ.15,498 అవుతుంది. ఇలా ఈ ఫోన్ ను త‌గ్గింపు ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

iPhone SE 2020 available in Flipkart with great discount
iPhone

ఇక ఈ ఫోన్‌పై ప‌లు బ్యాంకులు అందిస్తున్న ఆఫ‌ర్ల‌ను పొందితే అప్పుడు ఇంకా డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గ‌నుంది. కాగా యాపిల్ సంస్థ ఈనెల 8వ తేదీన ఐఫోన్ ఎస్ఈ 3 మోడ‌ల్‌ను లాంచ్ చేయ‌నుంది. దీన్నే ఐఫోన్ ఎస్ఈ ప్ల‌స్ 5జి, ఎస్ఈ 5జి మోడల్స్‌లోనూ రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఐఫోన్ ఎస్ఈ 2020 ని త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. కాగా పైన తెలిపిన ఆఫ‌ర్ ఐఫోన్ ఎస్ఈ (2020కి చెందిన 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌పై ల‌భిస్తోంది.

ఇక ఐఫోన్ ఎస్ఈ (2020) ఫోన్‌లో.. 4.7 ఇంచుల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 750 x 1334 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తుంది. అలాగే యాపిల్ ఎ13 బ‌యానిక్ చిప్‌సెట్‌ను అమ‌ర్చారు. వెనుక వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ముందు వైపు 7 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐపీ 67 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఇందులో ల‌భిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంది.

Share
Editor

Recent Posts