Kaju Dum Biryani : జీడిప‌ప్పుతో చేసే ఈ బిర్యానీ అంటే.. అంద‌రికీ న‌చ్చుతుంది.. ముద్ద కూడా విడిచిపెట్ట‌రు..!

Kaju Dum Biryani : బిర్యానీ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బిర్యానీని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వివిధ ర‌కాల బిర్యానీ వెరైటీల‌లో కాజు ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. జీడిపప్పుతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ కాజు ధ‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు ధ‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రోజ్ వాట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి పాలు – 80 ఎమ్ ఎల్, రెడు ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్.

Kaju Dum Biryani recipe in telugu how to make this
Kaju Dum Biryani

కాజు మిశ్ర‌మం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – అర క‌ప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, మిరియాలు – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, క్యాప్సికం క్యూబ్స్ – అర క‌ప్పు, క్యారెట్ త‌రుగు – అర క‌ప్పు, తాజా బ‌ఠాణీ – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – , 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, బ్రౌన్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టేబుల్ స్పూన్, ప‌సుపు – రెండు చిటికెలు, కాశ్మీరి కారం – అర టీ స్పూన్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – రెండు లీట‌ర్లు, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, యాల‌కులు – 4, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, గులాబీ రేకులు – ఒక టేబుల్ స్పూన్, జాపత్రి – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ఉప్పు – రెండున్న‌ర టేబుల్ స్పూన్స్, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

కాజు ధ‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, బ‌ఠాణీ వేసి మ‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మరిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. బియ్యాన్ని 80 శాతం ఉడికించిన త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టుకుని కాజు మిశ్ర‌మం మీద వేసుకోవాలి. త‌రువాత దీనిపై పాలు, ఫుడ్ క‌ల‌ర్, నెయ్యి, రోజ‌క్ వాట‌ర్ చ‌ల్లుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిపై సిల్వర్ ఫాయిల్ లేదా మైదాపిండి ముద్ద‌ను ఉంచి ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా గట్టిగా మూత పెట్టాలి. త‌రువాత దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంట‌పై 7 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత 20 నిమిషాల పాటు దీనిని అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజ్ ధ‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా కాజు బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts