Mushroom Masala : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా..

Mushroom Masala : మ‌నం పుట్ట‌గొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పుట్ట‌గొడుగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే విలువైన పోష‌కాలన్నీ ఈ పుట్ట గొడుగుల్లో అధికంగా ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పుట్ట‌గొడుగుల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. పుట్ట‌గొడుగుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, పుల్కా ఇలా దేనితోనే ఈ కూర‌ను తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే మ‌ష్రూమ్ మ‌సాలా కర్రీని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పుట్ట‌గొడుగులు – 200 గ్రా., ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, నువ్వులు – 2 టీ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌కర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక‌ క‌ప్పు, ట‌మాట ఫ్యూరీ – అర క‌ప్పు, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mushroom Masala recipe in telugu make in this way very easy
Mushroom Masala

మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక త‌రిగిన పుట్ట‌గొడుగుల‌ను వేసి 90 శాతం వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని చ‌ల్ల‌టి నీరు పోసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో ప‌ల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత నువ్వులు, గ‌స‌గ‌సాలు వేసి చిట‌ప‌ట‌లాడే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ అయ్యేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌లపాలి. త‌రువాత పావు క‌ప్పు నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉడికించిన పుట్ట‌గొడుగు ముక్క‌లు, కొత్తిమీర‌, బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పుట్ట‌గొడుగుల‌తో ఈ విధంగా చేసిన మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts